ఫామ్ లోకి వచ్చిన చెన్నై ఓపెనర్... ఇక "దంచుడే దంచుడు" !

VAMSI
గత ఐపిఎల్ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆరంజ్ క్యాప్ విన్నర్ గా నిలిచాడు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. అందుకే చెన్నై జట్టు యాజమాన్యం మహా మహా సీనియర్ ఆటగాళ్లను కాదనుకుని రుతురాజ్ ను వేలానికి వదలకుండా తమతోనే అంటి పెట్టుకుంది. అలా ఎన్నో అంచనాల నడుమ ఐపిఎల్ సీజన్ 15 ను ఆరంభించిన చెన్నై ని రుతురాజ్ మాత్రం చాలా నిరాశ పరిచాడు. నిన్నటి ముందు మ్యాచ్ వరకు చెన్నై ఆడిన అయిదు మ్యాచ్ లలో రుతురాజ్ కనీసం మొత్తం పరుగులు 50 కూడా చేయలేకపోయాడు. దీనితో చెన్నై వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయింది. ఆ తర్వాత 5 వ మ్యాచ్ గెలిచినా నిన్న ఆరవ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో ఓడిపోయి అప్రతిష్ట మూటగట్టుకుంది.

కానీ ఈ మ్యాచ్ లో ఒక పాజిటివ్ చెన్నై కి అని చెప్పవచ్చు. వరుసగా అయిదు మ్యాచ్ లలో విఫలం అయిన రుతురాజ్ ఈ మ్యాచ్ లో మాత్రం మునుపటిలా ఫామ్ ను అందుకుని దుమ్ము దులిపాడు. మొదట టాస్ గెలిచి గుజరాత్ బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఇంతకు ముందు మనము చెప్పినట్లుగానే రుతురాజ్ పవర్ ప్లే లో బాల్స్ వృధా అయినా తొందరపడకుండా తన ఇన్నింగ్స్ ను నిదానంగా ఆడాడు. నెమ్మది నెమ్మదిగా క్రీజులో నిలదొక్కుకోవడానికి టైం తీసుకున్నాడు. ఇక ఒక్కసారిగా సెట్ అయ్యాక... తన బాదుడు మొదలు పెట్టాడు.

గుజరాత్ బౌలర్ లను ఎవరినీ వదిలి పెట్టలేదు. లెగ్ సైడ్ ను లక్ష్యం గా చేసుకుని రుతురాజ్ ఫోర్లు సిక్సర్ లతో విరుచుకుపడ్డాడు. ఈ ఒక్క విషయంలో చెన్నై జట్టు ఓడిపోయినా సంతోషపడింది. రుతురాజ్ తన ఇన్నింగ్స్ లో కేవలం 48 బంతుల్లో 73 పరుగులు చేసిన చెన్నై 169 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో మొత్తం 5 ఫోర్లు మరియు 5 సిక్సర్లు ఉన్నాయి. ఇక ముందు ముందు ఇదే దంచుడు కార్యక్రమం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: