వరల్డ్ కప్: ఇంగ్లాండ్ ఆశలు సజీవం... ఒక్క గెలుపు దూరంలో సెమీస్?

frame వరల్డ్ కప్: ఇంగ్లాండ్ ఆశలు సజీవం... ఒక్క గెలుపు దూరంలో సెమీస్?

VAMSI
మహిళల వరల్డ్ కప్ లో ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు రెండు మ్యాచ్ లు జరిగాయి. కానీ అందులో ఒక మ్యాచ్ లో మాత్రమే ఫలితం తేలింది. మరొక్క మ్యాచ్ వర్షం కారణంగా కొన్ని ఓవర్ ల ఆట మాత్రమే సాధ్యం అయ్యి రద్దు అయింది. అయితే ఈ మ్యాచ్ రద్దు కావడం ఇంగ్లాండ్ కు మరియు ఇండియాకు బాగా లాభం చేకూర్చింది అని చెప్పాలి. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక జరిగి వెస్ట్ ఇండీస్ గెలిచి ఉంటే మొత్తం ఎనిమిది పాయింట్ లతో సెమీస్ కు అర్హత సాధించడానికి ఇంగ్లాండ్ మరియు ఇండియా జట్ల కన్నా ఒక అడుగు ముందు ఉండేది. కానీ ఇప్పుడు మ్యాచ్ రద్దు కావడంతో వెస్ట్ ఇండీస్ ఖాతాలో ఒక్క పాయింట్ మాత్రమే చేరింది.

దీనితో వెస్ట్ ఇండీస్ 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. అదే విధంగా ఈ రోజు జరిగిన రెండవ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించి సెమీస్ అవకాశాలను మరింత పెంచుకుంది. ఇక మిగిలిన ఒక్క మ్యాచ్ లో కనుక ఇంగ్లాండ్ గెలిస్తే డైరెక్ట్ గా ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఆఖరి మ్యాచ్ లో ఓడితే... ఇప్పటికే 7 పాయింట్ల తో ఉన్న వెస్ట్ ఇండీస్ సెమీస్ కు చేరుకుంటుంది. దీనిని బట్టి చూస్తే తర్వాత ఇంగ్లాండ్ మరియు ఇండియా జట్లు ఆడబోయే ఆఖరి మ్యాచ్ ఫలితాన్ని బట్టి సెమీస్ కు చేరబోయే 2 జట్లు కన్ఫర్మ్ కానున్నాయి.

ఇప్పటికే ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లు మంచి ఊపుమీదున్నాయి. ఈ రెండింటితో కలిసి అదే మరో రెండు జట్లు ఏవి అన్న విషయంపై సందిగ్దత ఇంకా తొలగిపోలేదు. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: