ద్రావిడ్ పై కోహ్లీ పైచేయి.. ఇదే లాస్ట్ చాన్స్?
అయితే సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని పట్టుదలతో విరాట్ కోహ్లీ సేన ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూడో టెస్ట్ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు కోహ్లీ సేన. అయితే రెండవ టెస్ట్ మ్యాచ్లో వెన్నునొప్పి కారణంగా అటు మ్యాచ్ కు దూరమైన విరాట్ కోహ్లీ మూడో టెస్ట్ మార్కెట్లో అందుబాటులోకి రావడం దాదాపు ఖరారయ్యింది. అయితే ఇక మూడవ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీనీ ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది.
భారత క్రికెట్లో దిగ్గజ క్రికెటర్ గా ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగుతున్న రాహుల్ ద్రవిడ్ రికార్డును అధికమించేందుకు విరాట్ కోహ్లీ కి ఛాన్స్ వచ్చింది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకూ భారత ఆటగాళ్ల లో అత్యధిక పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ 1161 పరుగుల తో మొదటి స్థానంలో ఉన్నాడు తర్వాత రాహుల్ ద్రావిడ్ 624 పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ 611 పరుగుల వద్ద ఉన్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ ద్రవిడ్ రికార్డును అధిగమించాలి అంటే కోహ్లీ మరో 14 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో ఇక మూడవ టెస్ట్ మ్యాచ్లో 14 పరుగులు చేసి కోచ్ రాహుల్ ద్రవిడ్ పై కోహ్లీ పైచేయి సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.