పాపం.. క్రిస్ గేల్ కి షాకిచ్చిన బోర్డు?
ఇప్పటికే టెస్టులు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్ గేల్ అటు టీ20 లో మాత్రం కొనసాగుతూ ఉన్నాడు. అయితే టి20 ఫార్మాట్లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు క్రిస్గేల్. ఈ క్రమంలోనే క్రిస్ గేల్ రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది అంటూ విమర్శలు కూడా వచ్చాయి.. ఇకపోతే ఇటీవలే క్రిస్ గేల్ రిటైర్మెంట్ ప్రకటించ పోతున్నాడు అన్న వార్తలు కూడా వైరల్ గా మారిపోయాయి. టి20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంపై గతంలో క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సొంతగడ్డపైనే టి20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నాను అంటూ క్రిస్ గేల్ చెప్పుకొచ్చాడు.
అయితే టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించి మనసులో మాట బయటపెట్టిన క్రిస్ గేల్ కి అటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. దిగ్గజ క్రికెటర్ అయినా క్రిస్ గేల్ కోరికను అటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాత్రం లైట్ తీసుకుంది అని చెప్పాలి. ఎందుకంటే త్వరలో ఐర్లాండ్ ఇంగ్లాండ్ లతో వెస్టిండీస్ జట్టు సొంతగడ్డపై టి20 సిరీస్ ఆడబోతుంది. ఈ క్రమంలోనే ఎంపిక చేసిన జట్టులో అటు క్రిస్ గేల్ చోటు కల్పించలేదు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. దీంతో సొంత గడ్డపై టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించాలన్న క్రిస్ గేల్ కోరిక ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. ఇక వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇలా చేయడంతో ఫాన్స్ అందరు షాక్ అవుతున్నారు.