ఫైనల్ ఎవరు గెలిచినా చరిత్రే... కానీ?

VAMSI
కరోనా తర్వాత ఐసీసీ నిర్వహిస్తున్న మెగా టోర్నీ టీ 20 ప్రపంచ కప్ 2021. నెల రోజుల పాటు సాగుతున్న టీ 20 సమరానికి మరో రెండు రోజుల్లో ముగింపు కలగనుంది. మొత్తం 16 జట్లు ఒక కప్ కోసం ఎంతో తీవ్రంగా శ్రమించాయి. చివరికి టైటిల్ వేటలో సూపర్ 12 లో జరిగిన మ్యాచ్ లలో అత్యంత ప్రదర్శన కనబరిచిన 4 జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధించాయి. టైటిల్ వేటలో ఫేవరెట్ లుగా భావించిన ఇండియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా మరియు పాకిస్తాన్ జట్లు కీలక సమయంలో ఒత్తిడికి లోనయి ఇంటి బాట పట్టాయి. అండర్ డాగ్ అనుకున్న న్యూజిలాండ్ జట్టు ఎవ్వరూ ఊహించని విధంగా తుది సమరానికి అర్హత సాధించి అడుగు దూరంలో చరిత్ర సృష్టించడానికి రెడీగా ఉంది.

ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు జరగబోయే టీ 20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఫేవరెట్ మాత్రం ఆస్ట్రేలియా అనే చెప్పాలి. ఎందుకంటే అన్ని విభాగాలలో పటిష్టంగా ఉన్న జట్టునే విజయం వరిస్తుంది. ఇది రాత్రి జరిగిన సెమిఫైనల్ 2 మ్యాచ్ లోనే రుజువయింది. ఒకానొక దశలో ఓటమై ఖరారు అనుకున్న ఆస్ట్రేలియా తన అనుభవంతో గెలుపు దిశగా వచ్చి ఫైనల్ కు చేరుకుంది.

మరి చివరి మ్యాచ్ లోనూ అదే ఆటతీరును కనబరిచి టీ 20 చరిత్రలో మొదటి సారి ఆస్ట్రేలియా కప్ ను సొంతం చేసుకుంటుందా అన్నది తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే. అదే విధంగా న్యూజిలాండ్ కు కూడా ఇది గెలిస్తే తొలి వరల్డ్ కప్ టైటిల్ అవుతుంది. అయితే ఇక్కడ న్యూజిలాండ్ కు మాత్రం అటు వన్ డే వరల్డ్ టైటిల్ ఇటు టీ 20 వరల్డ్ కప్ టైటిల్ ఇప్పటి వరకు దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: