బ్యాగ్ సర్దుకుని ఇంటికి పోవడమే : రవీంద్ర జడేజా

praveen
టి20 వరల్డ్ కప్ ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా మారిపోయింది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా మొన్నటి వరకు విజయం కోసం పోరాడిన అన్ని జట్లు.. ఇక ఇప్పుడు సెమీఫైనల్లో అవకాశం దక్కించుకోవడం పోరాడుతున్నాయి. ఈ క్రమంలోనే కేవలం విజయం సాధించడం కాదు భారీ తేడాతో విజయం సాధించి నెట్ రన్రేట్ సాధించి ఇక సెమీఫైనల్లో అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని చెప్పాలి. టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా పోరాటం అయితే అంత కంతకు ఆసక్తిని రేపుతోంది.


 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా రెండు మ్యాచ్ లలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో టీమిండియా రన్రేట్ ఒక్కసారిగా పడిపోయింది. ఇక టీమిండియా సెమీ ఫైనల్కు చేరడం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో మూడవ మ్యాచ్ నుంచి అద్భుతంగా పుంజుకున్న టీమిండియా ప్రత్యర్థికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం సాధించి భారీ తేడాతో విజయం సాధిస్తోంది. ఇక టీమిండియా సెమీస్ అవకాశాలను మరింత చేరువ చేసుకుంది .


 అయితే టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కి వెళ్ళాలి అంటే అంతా న్యూజిలాండ్ ఆట పై ఆధారపడి ఉంది. ఎందుకంటే నేడు న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడితేనే భారత్ సెమీఫైనల్కు  చేరుకుంటుంది. ఇకపోతే ఇటీవలే రవీంద్ర జడేజాను మీడియా ప్రతినిధి ఇదే విషయం పై ప్రశ్న అడగనా ఆసక్తికర సమాధానం చెప్పాడు ఈ సీనియర్ ఆల్ రౌండర్. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై న్యూజిలాండ్ గెలిస్తే ఎలా అంటూ ఒక రిపోర్టర్ ప్రశ్నించగా.. ఇంకేముంది బ్యాగ్ లు సర్దుకుని ఇంటికి వెళ్లిపోవడమే అంటూ సమాధానమిచ్చాడు రవీంద్ర జడేజా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: