టీమిండియా ఫైనల్స్ కి రావాలి.. పాక్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్?

praveen
దాయాది దేశాలైన భారత్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరి చూపు ఈ మ్యాచ్ ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్లో హై వోల్టేజీ మ్యాచ్ గా జరుగుతూ ఉంటుంది ఈ రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్ లు జరగవు. కేవలం వరల్డ్ కప్ లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతుంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక హోరాహోరీగా విజయం సాధించేందుకు పోరాడుతూ ఉంటాయి. ఇకపోతే ఇటీవల ప్రారంభమైన టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ భారత్ ఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది.


 అయితే ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ కూడా భారత జట్టుపై విజయం సాధించని పాక్ మొదటిసారి విజయం సాధించడంతో పాకిస్తాన్ అభిమానులను ఆనందంలో మునిగిపోయారు.అయితే ఈ మ్యాచ్ జరిగి రోజులు గడిచి పోతున్నాయి.  ఇప్పటికీ ఈ మ్యాచ్ కి సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉంది. అయితే పాకిస్థాన్తో ఓటమి తర్వాత న్యూజిలాండ్ చేతిలో కూడా ఓడిపోయిన టీమిండియా సెమిస్ అవకాశాలను ఎంతో కష్టంగా మార్చుకుంది. ప్రస్తుతం టీమిండియా అసలు సెమిస్ చేరుతుందా లేదా అన్నది కూడా ప్రస్తుతం డౌట్ గా మారింది. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 టీమిండియాను ఫైనల్స్లో చూడాలి అనుకుంటున్నా అంటూ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.  అయితే పాకిస్థాన్ క్రికెటర్ టీమిండియాను ఫైనల్స్ లో చూడాలనుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా.. దీని వెనుక కారణం కూడా ఉంది. టీమిండియా ఫైనల్స్కు వస్తే అక్కడ పాకిస్తాన్ జట్టు మరోసారి టీమిండియాను ఓడిస్తే చూడాలని ఉంది అంటూ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తమను ఓడించడానికి మరో అవకాశం ఇవ్వాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేసాడు షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: