కెప్టెన్ అయితే ఏంటి.. ధావన్ అలా చేయక తప్పదు : వివిఎస్ లక్ష్మణ్
ఇప్పటికే శిఖర్ ధావన్ టెస్ట్ ఫార్మాట్ కి పూర్తిగా దూరం అయిపోయాడు.. ఇక టీ20 క్రికెట్ లో కూడా రెగ్యులర్ ఓపెనర్ గా కనిపించడం లేదు. కేవలం వన్ డేల్లో మాత్రమే రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్కి దిగుతున్నాడు. అయితే అక్టోబర్ నెలలో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. వరల్డ్ కప్ లో జట్టులో స్థానం సంపాదించుకోవాలని భావిస్తున్నాడు శిఖర్ ధావన్. అందుకే శ్రీలంక టూర్ లో రాణించాలని ఎంతో ఆతృతగా ఉన్నాడు. మునుపటి తో పోలిస్తే ఇప్పుడు జట్టులో స్థానం సంపాదించుకోవడానికి ఎంతో పోటీ ఉంది. ఇలాంటి సమయంలో శిఖర్ ధావన్కు శ్రీలంక టూర్ ఎంతో కీలకమైనది అంటూ వి.వి.ఎస్.లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం యంగ్ టీమ్ ఇండియా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తు ఓవైపు జట్టు బాధ్యతలను భుజాన వేసుకోవడమే కాదు భారీగా స్కోర్లు చేయాల్సిన అవసరం కూడా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు వి.వి.ఎస్.లక్ష్మణ్. టి20 వరల్డ్ కప్ భారత జట్టు లో స్థానం సంపాదించు కోవాలి అంటే ఇక శ్రీలంక టూర్ లో భారీగా పరుగులు చేయడం తప్పనిసరి అంటూ హెచ్చరించాడు. ఇకపోతే ఈనెల 13వ తేదీ నుంచి శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్ లు ఆడనుంది భారత జట్టు. ఇప్పటికే ముంబాయిలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని కొలంబోలో ప్రత్యేక ఫ్లైట్ లో అడుగుపెట్టింది టీమ్ ఇండియా జట్టు. అక్కడ యంగ్ టీమ్ ఇండియా ఎలా రాణిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.