WTC ఫైనల్.. మళ్ళీ ఆ ఐరెన్ లెగ్ అంపైర్.. ఇండియన్ ఫ్యాన్స్ లో కలవరం?
ప్రస్తుతం ఇంగ్లండ్లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ కోసం కరోనా సమయంలో ఇతర దేశాల నుంచి అంపైర్లు వచ్చే అవకాశం లేకపోవడంతో న్యూట్రల్ అంపైర్ల ను ఐసిసి కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్కు చెందిన అంపైర్లు కీలకంగా మారిపోతారు. ఇలాంటి తరుణంలో అటు టీమిండియాకు ఇప్పటివరకు ఒక్క సారి కూడా కలిసి రాని రిచర్డ్ కెటిట్బరో ను ఐసీసీ ఫైనల్ మ్యాచ్ కోసం నియమించే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
దీంతో టీమిండియా కి ఐరన్ లెగ్ ఎంపైర్ గా మారిన రిచర్డ్ కెటిట్బరో ను ఎంపైర్ గా నియమించి వద్దు అంటూ అటు సోషల్ మీడియా వేదికగా భారత జట్టు అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు సైతం కోరుతున్నారు. ఇప్పటివరకు టీమ్ ఇండియా ఆడిన సమయంలో రిచర్డ్ కెటిట్బరో అంపైరింగ్ చేస్తే ఇక ఆ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. ఈ రికార్డ్ దృష్టిలో పెట్టుకుని ఐసీసీ రిచర్డ్ కెటిట్బరో ను అంపైర్ గా నియమించి వద్దు అంటూ కోరుతున్నారు అభిమానులు. కానీ ఇటీవల ఐసీసీ అధికారికంగా ప్రకటించిన అఫీషియల్స్ లో రిచర్డ్ కెటిట్బరో కూడా ఎంపికయ్యాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.