టీమిండియాలో కి మరో ఐపీఎల్ ప్లేయర్.. ఎంతైనా అతని లక్కే లక్కు..?
ఒకప్పుడు ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లు ప్రస్తుతం భారత జట్టులో స్థానం సంపాదించి తమ ప్రతిభ తో భారత జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న వారే. భారత జట్టులో స్థానం సంపాదించు కోవాలి అనుకున్న యువ ఆటగాళ్లకు అందరికీ బిసిసిఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక మంచి వేదికగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో తన సత్తా చాటడానికి ఎంతో మంది యువ ఆటగాళ్లు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. సమయం వచ్చిందంటే చాలు తమ సత్తా చాతి భారత అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకుని తమ కల నెరవేర్చుకుంటారు అనే విషయం తెలిసిందే .
ఇప్పటికే ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో రాణించి భారత జట్టులో స్థానం సంపాదించగా ఇక ఇటీవలే ఐపీఎల్ ప్లేయర్ భారత అంతర్జాతీయ జట్టులోని ఎంట్రీ ఇచ్చాడు. కర్ణాటక దేశవాళి క్రికెటర్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడిన ఆటగాడు ప్రసిద్ కృష్ణ మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఐపీఎల్ లో కోల్కతా జట్టు తరఫున 24 మ్యాచ్లు ఆడిన ఈ యువ ఆటగాడు 18 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు ఇప్పుడు బిసిసిఐ సెలక్టర్ల చూపు ఆకర్షించి భారత జట్టులో స్థానం సంపాదించుకుని కల నెరవేర్చుకున్నాడు.