ఐపీఎల్ 2021 : సన్రైజర్స్ అభిమానులకు ఊహించని షాక్..?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ కాస్త మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే అనుకున్న సమయానికి ఐపీఎల్ నిర్వహించాలని భావించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి దీనికి సంబంధించి తీవ్రస్థాయిలో కసరత్తు చేసి ఇటీవలే ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి.. షెడ్యూల్ కూడా ప్రకటించడంతో ఇక అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతగానో మురిసిపోయారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాయి. అయితే ఐపీఎల్ టోర్నీలో ఎంతగానో క్రేజ్  సంపాదించుకొని ప్రస్తుతం దూసుకుపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి అద్భుతంగా రాణిస్తుందని అనుకున్నారు అభిమానులు.

 ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుందా అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులందరికీ భారీ షాక్ తగిలింది అని అర్థమవుతుంది.  సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎన్నో ఏళ్ల నుంచి కీలకపాత్ర వహిస్తూ ఉన్న కేన్ విలియమ్సన్.. ఇక ఈ ఏడాది ఐపీఎల్కు దూరం కాబోతున్నాడా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. దీంతో అభిమానులు అందరూ ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్ టోర్నీ కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ కు షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

 ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ జట్టుకు విజయం అందించటంలో ఎంతగానో పోరాటం చేసే కేన్ విలియమ్సన్ ప్రస్తుతం మోచేతి  గాయం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు  అన్న విషయం తెలిసిందే. ఇటీవలే న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ జట్టు తో వన్డే సిరీస్ ఆడుతుండగా మోచేతి గాయం కారణంగా విలియమ్సన్ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే కేన్ విలియమ్సన్ ఐపీఎల్ కూడా అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి అని ఇప్పటికే గాయం కారణంగా అంతర్జాతీయ జట్టుకు డేవిడ్ వార్నర్ దూరం కాగా  ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కేన్ విలియమ్సన్ కు కూడా దూరం అయితే మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: