రైనా, హర్భజన్ లేకపోయినప్పటికీ చెన్నై గెలవగలదు..?

praveen
ఐపీఎల్ ప్రారంభాని కి ముందు చెన్నై జట్టు కు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. కొన్ని సీజన్ల  నుంచి చెన్నై జట్టులో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న సురేష్ రైనా హర్భజన్ సింగ్ లు  ఉన్నఫలంగా జట్టు నుండి  నిష్క్రమించడంతో అయోమయం లో పడింది జట్టు. అయినప్పటికీ పుంజుకుని ఇటీవలే జరిగిన ప్రారంభ మ్యాచ్ లో  మంచి విజయాన్ని అందుకుంది. అయితే రైనా, తాను  లేకపోయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ గెలవగలదు  అంటూ ఇటీవలె హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాలు చెప్పుకొచ్చారు హర్భజన్ సింగ్.



 వాస్తవం గా చెప్పాలంటే తాను ఐపీఎల్ లీగ్ ఎంతగా నో మిస్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చిన హర్భజన్ సింగ్... మొదటినుంచి ఐపీఎల్ లో  తాను భాగమయ్యాను  అంటూ గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ ఏడాది పరిస్థితులు ఎంతో భిన్నంగా ఉన్నాయని... ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కుటుంబంతో  కలిసి ఉండేందుకు తాను ప్రాధాన్యం ఇచ్చాను  అంటూ చెప్పుకొచ్చారు. సిఎస్కే జట్టు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు హర్భజన్ సింగ్.  ఏ జట్టు అయినా విజయం సాధించవచ్చు అంటూ తెలిపిన హర్భజన్ సింగ్ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంటూ తెలిపారు.



అయితే ఈ టైటిల్ గెలిచే సత్తా చెన్నై కి   ఉంది అంటూ తెలిపిన హర్భజన్... ఆ జట్టులో సురేష్ రైనా,  హర్భజన్ లేకపోయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు అంటూ తెలిపారు. ఎందుకంటే చెన్నై జట్టులో ఎంతో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు హర్భజన్. కాగా ఇటీవలే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో  చెన్నై సూపర్ కింగ్స్ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: