ధోనిని కెప్టెన్ గా తీసేద్దాం అనుకున్నారు.. కానీ నేనే అడ్డుకున్నా..?
షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు పోతున్నారు ధోని అభిమానులు. అయితే ధోని భారత క్రికెట్ చరిత్రలో ఎంతో విజయవంతమైన కెప్టెన్గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే, ఇప్పటివరకు ఏ కెప్టెన్ కి కూడా సాధ్యం కానిది మహేంద్ర సింగ్ ధోనీ రెండు ప్రపంచ కప్ లను భారత జట్టుకు అందించాడు, భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా రెండు ప్రపంచ కప్ లను భారత్ కు అందించలేదు. ఆటగాళ్లను ముందుండి నడిపించడంలో... ఎంత ఒత్తిడిలో అయినా ఎంతో కూల్ గా నిర్ణయాలు తీసుకోవడంలో... గెలుపు ఓటములను సమాంతరంగా చూడటంలో ధోని ఎప్పుడు అందరికంటే భిన్నంగా ఉంటాడు అనే చెప్పాలి,
అయితే ధోనీ కెప్టెన్సీపై తాజాగా బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనిని కెప్టెన్ గా తొలగించాలి అనుకున్నప్పుడు పట్టు భట్టి మరి ధోనీ కెప్టెన్గా కొనసాగేలా చేశాను అంటూ చెప్పుకొచ్చారు. 2011లో ధోనీ కెప్టెన్సీలోని భారత జట్టు ప్రపంచ కప్ గెలిచిన అనంతరం... ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా లతో టెస్టు సిరీస్లో చిత్తుగా భారత జట్టు ఓడిందని.. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్గా ధోనీని తొలగించి వేరొకరిని నియమించాలని సెలక్షన్ కమిటీ భావించింది అని చెప్పుకొచ్చారు శ్రీనివాసన్. కానీ ఆ సమయంలో బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న తాను తన విశేషాధికారాలను ఉపయోగించి ధోనిని తప్పించకుండా అడ్డుకున్నట్లు చెప్పుకొచ్చారు.