న్యూజిలాండ్ తో జరిగిన 5టీ 20ల సిరీస్ ను  క్లీన్ స్వీప్ చేసిన  టీమిండియా  రేపటి నుండి జరిగే  మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్  పై కూడా  కన్నేసింది.  అందులో భాగంగా రేపు  ఇరు జట్ల మధ్య మొదటి వన్డే జరుగనుంది. ఇక ఈసిరీస్ కు భారత స్టార్ ఓపెనర్లు శిఖర్ ధావన్ , రోహిత్ శర్మ  దూరం కావడంతో ఓపెనింగ్ ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే  తాజాగా కోహ్లీ  దీని పై క్లారిటీ ఇచ్చాడు. యువ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా రేపటి మ్యాచ్ తో వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని దాంతో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా ఓపెనర్లుగా రానున్నారన