రెండు బంతుల్లో రెండు వికెట్లు ... 9నిమిషాల్లో ముగిసిన మ్యాచ్
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ లో చిత్తుగా ఓడిపోయినా ప్రొటీస్ జట్టు రెండో టెస్ట్ లో 137 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో పరాజయాన్ని చవిచూడగా చివరి టెస్ట్ లో 202 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పూర్తిగా వన్ సీడెడ్ గా జరిగిన ఈ సిరీస్ ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసి సొంత గడ్డపై ఎదురులేదని మరోసారి నిరూపించింది. అంతేకాదు టెస్టుల్లో సౌతాఫ్రికా ను మొదటి సారి వైట్ వాష్ చేసి టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇక ఈవిజయం తో వరుసగా 5మ్యాచుల్లో గెలిచి 240 పాయింట్ల తో భారత్ నెంబర్ 1 స్థానాన్ని మరింత పదిలం చేసుకోగా సౌతాఫ్రికా వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి పాయింట్ల ఖాతా కూడా తెరువలేకపోయింది.