శ్రీవారి భక్తులకు షాకింగ్ న్యూస్... దర్శనం కోసం ?

VAMSI
తిరుపతి తిరుమల దేవస్థానం ఎపుడు కూడా భక్త జనం తో కిటకిటలాడుతు ఉంటుంది. కరోనా టైం లో లాక్ డౌన్ కారణంగా శ్రీనివాసుని దేవాలయానికి సైతం తాళం పడటం తెలిసిందే. ఆ తర్వాత మెల్ల మెల్లగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం తో ఇపుడు భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఆ ఏడుకొండల స్వామి ని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుండి జనం తరలి వస్తున్నారు. తిరుమల లోని శ్రీవారి సర్వ దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. స్వామివారి దర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
నిన్నటి రోజున గురువారం  ఏడుకొండల స్వామిని 73,371 మంది దర్శించుకోగా, అందులో 39,924 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక భక్త జనం ఆ శ్రీనివాసునికి సమర్పించిన కానుకలు... హుండీ ద్వారా ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చిందని వెల్లడించారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తుడా ఛైర్మన్ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిన్న శ్రీనివాసుని మందిరం లో ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆలయం లో ఏడు కొండల స్వామి సేవా కార్యక్రమాల్లో భక్త జనం మునిగితేలుతున్నారు.
అయితే కారణాలు ఏమైనా కానీ టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భక్తులు అంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. భక్తులు ఎంఎంత ఎక్కువ అయినప్పటికీ దానికి తగిన ఏర్పాట్లను చేస్తూ దర్శనం త్వరగా అయ్యేలా చేయడమే టీటీడీ పాలకమండలి కర్తవ్యం కదా ఐ మరికొందరు టీటీడీ తీరుపై విమర్శిస్తున్నారు. ఇక ఈ వార్తను తెలుసుకున్న కొందరు భక్తులు ఈ సమయంలో తిరుమల వెళ్లడం అవసరమా అని ఆలోచనలో పడ్డారట. మరి త్వరలోనే పరిస్థితి కుదుటపడుతుంది కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: