రామమందిరం కోసం .. పవిత్ర జలాల సేకరణ సిద్ధం ..
మందిరం నిర్మాణం పూర్తి అయ్యేవరకు ఆ నిర్మాణ స్థలంలో తాత్కాలికంగా ఎప్పటి నుండో ఉన్న రామ విగ్రహాలకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. అక్కసారి ఆలయ నిర్మాణం పూర్తి కాగానే ఈ విగ్రహాలను పునః ప్రతిష్ట చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏడు ఖండాలలోని 192 దేశాల లో ఆయా జలాశయాల నుండి పవిత్ర జలాలను తీసుకు వచ్చారు. దేశరాజధాని ఢిల్లీకి చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ జాలీ ఆధ్వర్యంలో ఈ సేకరణ జరుగుతుంది. ఇటీవలే ప్రపంచం లోని 115 దేశాల లోని నదులు, సముద్రాల నుండి సేకరించిన పవిత్రజలాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తన నివాసంలో అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రామ జన్మభూమి ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చెంపత్ రాయ్ డెన్మార్క్, ఫిజి, నైజీరియా వంటి పలు దేశాల రాయబారులు, హైకమిషనర్లు ఉన్నారు.
ఈ పవిత్ర జలాలను ఆలయ శుద్ధి కోసం, రామాభిషేకానికి వినియోగించనున్నారు. మిగిలిన దేశాల నుండి కూడా పవిత్ర జలాల సేకరణ జరుగుతుందని రాజ్ నాధ్ సింగ్ చెప్పారు. మందిర నిర్మాణం పూర్తి అయ్యేలోపు ఆ సేకరణ కూడా చేస్తారని ఆయన తెలిపారు.బాబ్రీ మసీదు-రామమందిరం వివాదం ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్నా ఒక కొలిక్కి రాలేదు. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ సమస్య త్వరిత గతిన ఒక పరిష్కారం ఇరువురి కి ఆమోదయోగ్యం కావడంతో మందిర నిర్మాణం తిరిగి చేపడుతున్నారు. అలాగే కోర్ట్ ఆదేశాల మేరకు బాబ్రీ మసీదు కు ఆయా మతస్తులకు స్థలం కేటాయించాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.