సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన వారముగా శాస్త్రాల్లో చెప్పబడింది. మీ ఇష్టకార్యాలను నెరవేర్చుకోవడానికి శివ పూజ చేసినట్లైతే ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది తప్పక మీ కోర్కెలు నెరవేరుతాయి. భోళాశంకరుడిగా పిలవబడే శివుడ్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తే తప్పక కరుణిస్తాడు. ఇప్పుడు పూజా విధానంలోకి వెళ్తే, ఏ పూజకు అయినా తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రపరిచి పూజ గదిని పరిశుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో ఇంటికి ఈశాన్య దిక్కున పీట వేసి ఆ పీటను పసుపుకుంకుమలతో అలంకరించి...వరి పిండితో పీటపై పద్మముగ్గులు పెట్టాలి. అలంకరించిన పీటపై బియ్యం పోసి శివపార్వతులు, గణపతి, కుమారస్వామి కలిసి ఉన్నటువంటి ఫోటోను పెట్టాలి. ఆ చిత్ర పటమునకు రుద్రాక్ష మాల కానీ, శివునికి ఎంతో ప్రీతికరమైన జమ్మి, జిల్లేడు, మోదుగ, వట్టివేరు పూలు, పొగడ, తామర, తుమ్మి, ఉత్తరేణి, జాజి, మందారం, నందివర్ధనం, పొన్న, గన్నేరు వంటి పూలు ఆయనకు ఎంతో ప్రీతికరమైనవి అయినందున వీటిలో ఏవైనా పుష్పాలతో చేసినటువంటి మాలను శివుని చిత్ర పటానికి వేయాలి.
నైవేద్యం, అక్షింతలను పక్కన పెట్టుకుని పూజను ఆరంభించాలి. అలాగే శివ అష్టోత్తర నామావళి ఉన్న పుస్తకాన్ని కూడా పక్కనే పెట్టుకోవాలి. ముందుగా దీపారాధన చేసిన నమస్కరించుకోవాలి. పసుపుతో చేసినటువంటి గణపతిని పసుపు కుంకుమలతో అలంకరించి ఒక తమలపాకుపై ఉంచాలి. "ఓం శ్రీం హ్రీం క్లీం క్లోం గం గణపథాయే.. వర వత్ర సర్వజనమాయ్ వాసమనయ స్వాహా ఏకదంతాయ విద్ మహే వక్రతుండాయా దీమహి తన్నో దంతి ప్రచోదయాత్" అంటూ పూజిస్తూ అక్షింతలు గణపతిపై వేసి నమస్కరించుకోవాలి.
అనంతరం శివ పూజను ప్రారంభించాలి. ఎందుకంటే ఏ పూజ అయినా సరే ముందుగా గణ నాయకుడికి ప్రథమ పూజ అందించడం మన ఆనవాయితీ అలాగే శాస్త్రములు చెబుతున్న ఆచారం. గణపతికి ప్రీతికరమైన బెల్లమును నైవేద్యంగా పెట్టాలి.
అనతరం శివ దేవునికి పూజ మొదలు పెట్టాలి. శివ అష్టోత్తర శత నామావళి 108 నామములను జపిస్తూ కుంకుమ అర్చన చేయాలి. "ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః" అంటు 108 నామాలను జపించాలి. శివునికి నైవేద్యంగా.... మారేడు దళం, ఆవు పాలు, అలాగే ఏదైనా ప్రసాదాన్ని తయారు చేసి ఉంచాలి కొబ్బరికాయను చిన్న ముక్కలుగా కోసుకుని అందులో పంచదార వేసి కలుపుకొని ప్రసాదంగా చేసుకోవాలి. అలాగే పూజ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. ఇప్పుడు మారేడు దళం సమర్పించాలి శివునికి మారేడు దళం అంటే చాలా ప్రీతి ఇప్పుడు ఇప్పుడు హారతిని ఇచ్చి అనంతరం శివుని కథను చడువుకోవాలి. బ్రాహ్మణుడు తన దారిద్ర్య బాధలను తొలగించు కున్నాడు.