తిరుపతి లడ్డూ ఎలా పుట్టిందంటే...?
నేటికీ ఆ లడ్డు పుట్టి 306వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. చాలా మందికి శ్రీవారి లడ్డు అంటే చాలా ఇష్టం. ఈ లడ్డూ మొదటగా అనేక రూపాలను మార్చుకుని చివరికి లడ్డుగా మనకు అందించబడుతోంది. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం క్రీస్తు శకం 1803వ సంవత్సరంలో బూందీగా అందరికీ పరిచయం అయ్యింది. 1940వ సంవత్సరంలో పూర్తిగా అది లడ్డూగా మారి స్థిరపడిపోయింది. తిరుమల శ్రీవారి లడ్డును చక్కెర, శనగపిండి, నెయ్యి, ఆయిల్, యాలకులు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్తో తయారు చేస్తారు. అనేక రకాల ప్రసాదాలను టీటీడీ తీసుకు వచ్చినప్పటికీ భక్తులందరూ ఆ లడ్డూనే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఈ శ్రీవారి లడ్డూ 1715వ సంత్సరానికి ముందు నుంచే ఉందని కొందరు చెబుతుంటారు. ఏది ఏమైనప్పటికీ శ్రీవారి లడ్డూ 306 ఏళ్ల క్రితం అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచం మొత్తం ఈ శ్రీవారి లడ్డూ అంటే ఎంతో ప్రీతి అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది.