ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారో తెలుసా..!
ఇక హిందువుల కాలెండర్ ప్రకారం చైత్ర మాసాన్ని మొదటి నెలగా భావిస్తారు, ఈ మొదటి నెల ప్రారంభమయిన చైత్ర శుద్ద పాడ్యమి రోజున ఊగాదిగా పండుగ చేసుకుంటారు. ఈ ఊగాదినే మహారాష్ట్రలో “గుడి పాడ్వా“ గా చేసుకుంటారు. ఈ రెండు పండుగల అంతరార్ధం ఒకటే కావున ఈ రెండు పండుగలూ ఒకటే. పేర్లు మాత్రమే వేరు. ఈ నాలుగు రాష్ట్రాలలో పండుగ చేసుకునే విధానాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఇది ఉదయాన్నే ప్రారంభమై రాత్రి వరకూ ఉండి వెళ్లిపోతుంది కానీ , పండుగ చేసుకునే విధానంలో మాత్రం రాష్ట్రాలకు, సమాజాలకూ వ్యత్యాసాలు ఉంది.
అంతేకాదు.. హిందువులు జరుపుకునే ప్రతి పండగకు ఒక దేవుడు ఉంటాడు..వినాయకుడు రాముడు, కృష్ణుడు, దుర్గ, ఇలా దేవి, దేవతలు అధినాయకులుగా ఉంటారు. వారిని పూజిస్తాం.. అయితే ఉగాది రోజున మాత్రం కలిపురుషుడు అధిదేవత. అందుకనే ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది.
అలాగే.. మానవ జీవితం అంతా కాలం పైననే ఆధారపడి ఉంటుంది. అందుకనే కాలపురుషుని ఉగాది రోజున ఆరాధించాలి. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పబడినట్లు మనం ఏ రూపంలో స్తుతించినా అది పరమాత్మునికే చెందుతుంది. ఈ దృష్టితో కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపాన స్తుతించాలి. అంతేకాదు కాల విశేషణాలను తెలుసుకోవడమే పంచాంగం పరమ ప్రయోజనం.. కనుక ఈరోజున ఆలయం లో అత్యంత నిష్ఠతో వేద పురోహితులు పంచాంగ శ్రవణం పఠిస్తారు.