హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు మీద కసంతా తీర్చేసుకుంటున్నాడా ?
మొదటి నుండి చంద్రబాబు మీద బిజెపిలోని కొందరు నేతలకు బాగా మంటగా ఉందట. అటువంటి వారిలో వీర్రాజు కూడా ఒకడు. పార్టీకి ట్రూ ఫాలోయర్, స్ట్రాంగ్ సపోర్టర్ అయిన వీర్రాజుకు అనేక అంశాల్లో చంద్రబాబు అంటే మండిపోతోంది. అవేమిటంటే పార్టీని అవసరానికి వాడుకుని అవసరం తీరిపోగానే చంద్రబాబు దూరంగా విసిరేస్తున్న విధానాన్ని అధ్యక్షుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. అలాగే మిత్రపక్షంగా ఉన్నపుడు కూడా కమలంపార్టీని ఎదగనీయకుండా చంద్రబాబు తొక్కేశాడనేది అధ్యక్షుని ప్రధాన ఆరోపణల్లో ఒకటి. తమతో ఎప్పుడు పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు వెన్నుపోట్లు పొడుస్తునే ఉన్నాడంటూ ఫైర్ అయిపోతుంటాడు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారంలో ఉన్నపుడు తాను వివిధ అంశాలపై ఎలా వ్యవహరించాడనే విషయాన్ని చంద్రబాబు మరచిపోతున్నాడు. వైసిపి హయాంలో దాదాపు అవే సీన్లు రిపీట్ అవుతుంటే ఫార్టీ ఇయర్స్ రెచ్చిపోతున్నాడు. దాంతో చంద్రబాబుపై ఎప్పటి నుండో అణిచిపెట్టుకునున్న మంటతో వెంటనే వీర్రాజు రెచ్చిపోతున్నాడు. తాజా ఉదాహరణనే తీసుకుంటే చంద్రబాబు హయాంలో కూడా విజయవాడలో రాత్రికి రాత్రే 36 గుళ్ళను కూల్చేశాడు. మళ్ళీ ఇంకెక్కడో కడతానని చెప్పాడు కానీ ఎక్కడా కట్టలేదు. అలాంటిది అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్ధానం రథం తగలబడిపోయిన అంశంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాడు. దాన్ని అవకాశంగా తీసుకుని వీర్రాజు వెంటనే చంద్రబాబుపై రెచ్చిపోయాడు.