టీమిండియా అలసిపోయింది.. ఆసిస్ ఫ్రెష్ గా ఉంది : పాంటింగ్

praveen
మరికొన్ని రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్లో ఒక కీలకమైన పోరికి సమయం ఆసన్నమైంది అన్న విషయం తెలిసిందే . దాదాపు రెండేళ్ల నుంచి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. జూన్ ఏడవ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇక ఈ మ్యాచ్ ఉండబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య హోరాహోరీ పోరుకు అంత సిద్ధమైంది. అయితే ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అటు లండన్ లోని ఓవల్ మైదానం ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పాలి.

 అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇక్కడ డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ గురించి స్పందిస్తూ ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇరు జట్ల బలాబాలాలు ఏంటి అనే విషయం పైన చర్చించుకుంటున్నారు. అంతేకాదు తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయం గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 డబ్ల్యూటీసి ఫైనల్లో విజయావకాశాలు ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయి అంటూ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తో పోల్చి చూస్తే ఆస్ట్రేలియా నే కాస్త ఫేవరెట్ గా కనిపిస్తుంది   ఓవల్ మైదానంలో పిచ్ కండిషన్స్ భారత్ కంటే ఆస్ట్రేలియా కె ఎక్కువగా సూట్ అవుతాయి. అంతేకాకుండా ఇక భారత ఆటగాళ్లందరూ మొన్నటి వరకు ఐపీఎల్ ఆడి అలసిపోయి ఇప్పుడు డబ్ల్యూటీసి ఫైనల్ ఆడబోతున్నారు. కానీ అటు ఆస్ట్రేలియా ప్లేయర్లు మాత్రం ఎంతో ఫ్రెష్ గా బరిలోకి దిగబోతున్నారు అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఇవన్నీ కూడా మ్యాచ్ ను ప్రభావితం చేస్తాయి అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc

సంబంధిత వార్తలు: