ఐపీఎల్ ఫైనల్ వర్షంతో ఆగిపోతే... ఏ టీం గెలుస్తుందో తెలుసా?

praveen
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్ ఆదివారం జరగనుంది. అహ్మదాబాద్‌లో జరిగే IPL 2023 ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనుంది. IPL టోర్నమెంట్‌లో CSK ఇప్పటికే పలుసార్లు టైటిల్ నెగ్గింది. GT టీమ్ కూడా IPL టైటిల్‌ను ముద్దాడింది. ఈ రెండు టీమ్స్ మధ్య జరగనున్న తుది పోరులో నెగ్గేది ఎవరనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ జరిగే టైమ్‌లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్‌క్యాస్ట్స్‌ పేర్కొంటున్నాయి.
అహ్మదాబాద్ వాతావరణ శాఖ ప్రకారం మ్యాచ్ జరిగే సమయానికి అక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం నరేంద్ర మోదీ స్టేడియం ఉన్న అహ్మదాబాద్‌లో 61 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని ఆక్యువెదర్ (AccuWeather) కూడా తెలిపింది. ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు అవుతుందేమోనని వారు బాగా భయపడుతున్నారు. అయితే వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే నెక్స్ట్ డే అంటే సోమవారం రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్‌కు సోమవారాన్ని రిజర్వ్ డేగా ప్రకటించింది.
ఒకవేళ మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వర్షం పడి అంతరాయం కలిగితే.. మరుసటి రోజు ఆగిన మ్యాచ్‌ను అక్కడి నుంచే పునఃప్రారంభిస్తామని తెలిపింది. టాస్‌ వేసిన తర్వాత వానొస్తే.. సోమవారం మళ్లీ టాస్ వేసి మ్యాచ్ మొదలు పెడతామని వివరించింది. దురదృష్టం కొద్దీ సోమవారం అంతా కూడా వర్షం పడితే, టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ ను బీసీసీఐ ఐపీఎల్ 2023 విన్నర్ గా ప్రకటిస్తుంది. కాగా కనీసం సూపర్ ఓవర్ నిర్వహించి విజేత ఎవరు అనేది తేల్చడానికి భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:20 నిమిషాల వరకు టైమ్‌ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: