చెన్నైతో మ్యాచ్ ఆడే ముంబై జట్టు ఏది.. అశ్విన్ పోస్ట్ వైరల్?

praveen
2023 ఐపీఎల్ సీజన్ చివరి దశకు చేరుకుంది . ఈ క్రమంలోనే ఐపీఎల్ టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారు అనే విషయంపై సర్వత్రా చర్చ నెలకుంది. అందరూ కూడా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు అని చెప్పాలి  ఇక ప్లే ఆఫ్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లను వీక్షిస్తూ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ని పొందుతున్నారు ఎంతోమంది క్రికెట్ లవర్స్. ఈ క్రమంలోనే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్లో విజయం సాధించిన చెన్నై జట్టు ఎలాంటి గణాంకాలు లేకుండానే నేరుగా ఫైనల్ అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే.

 అయితే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ మాత్రం.. ఇక మరోసారి ఫైనల్ అడుగు పెట్టేందుకు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ఆడి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుంది. ఇటీవల ముంబై ఇండియన్స్ లక్నో తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్ లో ముందడుగు వేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపిఎల్ విన్నర్ ఎవరు అనే విషయం గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మాత్రం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఏ ముంబై జట్టు తలబడుతుంది అంటూ ఒక పోస్ట్ పెట్టాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక ఈ ఫోటోలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్య గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నారు. అయితే ప్రస్తుతం హార్థిక్ పాండ్యా గుజరాత్ లో ఆడుతున్న.. కృనాల్ లక్నో జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ గతంలో వీరంతా కూడా ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాళ్ళుగా కొనసాగినవారే. ఈ క్రమంలోనే అశ్విన్ ఇలాంటి పోస్ట్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ ముగ్గురి ముంబై ఇండియన్స్ ప్లేయర్లలో ఏ ముంబై ఇండియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ ఆడతాడు అంటూ అశ్విన్ పోస్ట్ పెట్టగా.. ఇక అటు నెటిజెన్స్ అందరు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: