ఇక ఐపిఎల్ ప్లే ఆఫ్స్లో సీఎస్కే టీం కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనికి తిరుగులేని సూపర్ డూపర్ రికార్డు అనేది ఉంది. మహేంద్ర సింగ్ ధోని ఇప్పటి దాకా మొత్తం 21 ప్లే ఆఫ్స్ ఇన్నింగ్స్ల్లో మొత్తం 522 పరుగులు బాదాడు.ఇక ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యుత్తమం. ప్లే ఆఫ్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మరో స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా పేరిట ఉంది. సురేష్ రైనా.. 24 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 714 పరుగులు చేశాడు. రైనా, ధోని తర్వాత షేన్ వాట్సన్ (12 ఇన్నింగ్స్ల్లో 389 పరుగులు), మైక్ హస్సీ (11 ఇన్నింగ్స్ల్లో 388 పరుగులు) ఇంకా ఫాఫ్ డుప్లెసిస్ (14 ఇన్నింగ్స్ల్లో 373 పరుగులు) ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో ఉన్నారు. ఈ లిస్టులో టాప్-5 ఆటగాళ్లంతా సీఎస్కే సభ్యులే కావడం విశేషం.ఇక ప్లే ఆఫ్స్లో ధోని గణాంకాలు చూసి, నేటి (మే 23, క్వాలిఫయర్-1) మ్యాచ్లో సీఎస్కే టీం ప్రత్యర్ధి అయిన గుజరాత్కు బాగా వణుకు పుడుతుంటుంది. అసలే మహేంద్ర సింగ్ ధోని గత కొన్ని సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో చాలా బాగా ఆడుతున్నాడు. పైగా దానికి తోడు అతని ప్లే ఆఫ్స్ గణాంకాలు కూడా మరింత బయపెట్టేవిగా ఉన్నాయి.ఇక ఈ పరిస్థితుల్లో నేటి మ్యాచ్లో ధోని అత్యంత ప్రమాదకర బ్యాటర్గా మారే ఛాన్స్ ఉంది.
మహేంద్ర సింగ్ ధోనిని కట్టడి చేసేందుకు గుజరాత్ బౌలింగ్ విభాగం అయితే ప్రత్యేక వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. మ్యాచ్ ధోని దాకా వచ్చిందో అతన్ని ఆపడం కష్టమేనని అభిమానులు కూడా ఎంతగానో భావిస్తున్నారు. ఛేజింగ్ లో అయినా ఇంకా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా పాత ధోనిని చూడటం ఖచ్చితంగా ఖాయమని అతని అభిమానులు పందెలు కాస్తున్నారు.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మహేంద్ర సింగ్ ధోని భీకర ఫామ్లో ఉన్న విషయం తెలిసిందే. అతను ఆడిన 10 ఇన్నింగ్స్ల్లో 51.50 సగటున 190.74 స్ట్రయిక్ రేట్తో మొత్తం 103 పరుగులు చేశాడు. సీఎస్కే టాపార్డర్ కూడా ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండటంతో ధోనికి సరైన అవకాశాలు రాలేదు. వచ్చిన దాంట్లో ధోని తనదైన స్టయిల్లో బ్యాట్ను ఝులిపించాడు. ఇక ఇదిలా ఉంటే, చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా గుజరాత్, సీఎస్కే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ నేడు రాత్రి 7: 30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు ఓడినా మరో ఛాన్స్ ఉంటుంది.గెలిచిన టీం డైరెక్ట్ గా ఫైనల్ పోతుంది.