కోహ్లీ.. ఇప్పటికైనా ఆర్సిబి నుంచి తప్పుకో : పీటర్సన్

praveen
విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు జట్టును అటు దురదృష్టం మాత్రం అస్సలు వీడడం లేదు. ఎందుకంటే జట్టులో ఎన్ని  మార్పులు చేసిన ఆ టీం మాత్రం అటు టైటిల్ గెలవడంలో.. ప్రతిసారి విఫలమవుతూనే ఉంది. ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్లో ఈ సాల కప్ నమ్దే అంటూ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ ఉంటుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. కానీ కీలకమైన మ్యాచులలో చేతులెత్తేయడంతో చివరికి ఇక అనుకున్నది సాధించకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించే  పరిస్థితిని కొని తెచ్చుకుంటూ ఉంటుంది.

 అయితే ఒకప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇక ఇప్పుడూ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఆ బాధ్యతలను డూప్లిసిస్ కి అప్పగించిన కూడా ఇక ఆ జట్టు ఆటతీరులో  మాత్రం మార్పు రాలేదు. అయితే ఇటీవల 2023 ఐపీఎల్ సీజన్లోనూ ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టకుండానే టోర్ని నుంచి నిష్క్రమించింది. దీంతో విరాట్ కోహ్లీ ఎంతో నిరాశతో డాగ్ అవుట్ లో కూర్చున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఇలా మళ్లీ కప్పు గెలవలేకపోయామే అని అభిమానులు అందరూ కూడా నిరాశలో ఉన్న సమయంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ పై కోహ్లీ సెంచరీ చేసిన ఆర్సిబి ప్లే ఆఫ్స్ కు వెళ్లలేకపోయింది. ఈ క్రమంలోనే కోహ్లీ టీం మారాల్సిన సమయం వచ్చింది. కోహ్లీ ఢిల్లీ టీం లోకి మారాలి అంటూ కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ పోస్ట్ పై స్పందిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఏదో ఒక రోజు మా టీం కప్పు గెలుస్తుంది. కానీ కప్పు గెలిచిన లేకున్నా మేము మా టీం తోనే ఉంటాం అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: