ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL) 2023లో భాగంగా నేడు(శుక్రవారం) ధర్మశాల వేదికగా పెద్ద పోటీ అనేది జరగనుంది. పంజాబ్ కింగ్స్ టీంతో రాజస్థాన్ రాయల్స్ టీం తలపడనుంది.ఇంకా ఈ సీజన్లో రెండు జట్లకు కూడా లీగ్ దశలో ఇదే చివరి మ్యాచ్. రాజస్థాన్, పంజాబ్ టీమ్స్ చెరో 13 మ్యాచులు ఆడగా మొత్తం ఆరు మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇక పాయింట్ల పరంగా కూడా సమానంగానే ఉన్నప్పటికి మెరుగైన నెట్ రన్రేట్ వల్ల రాజస్థాన్ ఆరో స్థానంలో ఇంకా పంజాబ్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక ప్లే ఆఫ్స్ రేసులో కనుక ఉండాలంటే నేటి మ్యాచులో ఖచ్చితంగా విజయం సాధించాల్సిందే.ఇక ఓడిన జట్టు ఇంటి ముఖం పట్టక తప్పదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఖచ్చితంగా హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.ఇక ఈ రోజు మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. అయితే.. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే మాత్రం సంజూసేన ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.అయితే.. మిగిలిన జట్ల ఫలితాలపై రాజస్థాన్ ప్లే ఆఫ్స్ కు వెలుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ముంబై, బెంగళూరు టీమ్స్ తమ చివరి లీగ్ మ్యాచుల్లో ఓడిపోతే అప్పుడు రాజస్థాన్, బెంగళూరు ఇంకా ముంబై పాయింట్లు సమానం అవుతాయి.
ఆ సమయంలో నెట్ రన్రేట్ అనేది కీలకం కానుంది. మెరుగైన నెట్రేట్ కలిగిన జట్టు ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ కూడా ఉంది.ఇక ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి దాకా రెండు జట్లు 25 సార్లు ముఖాముఖిగా తలపడటం జరిగింది. మొత్తం 14 మ్యాచుల్లో రాజస్థాన్ టీం విజయం సాధించగా. 11 మ్యాచుల్లో పంజాబ్ టీం గెలుపొందింది. ఈ సీజన్లో రెండు జట్లు ఓ సారి తలపడ్డాయి. ఇక ఆ మ్యాచులో పంజాబ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.పంజాబ్ కింగ్స్ టీం విషయానికి వస్తే..శిఖర్ ధావన్(కెప్టెన్) , అథర్వ తైడే, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కరన్, షారుక్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్ ఇంకా అర్ష్దీప్ సింగ్ అలాగే ప్రభ్సిమ్రాన్ సింగ్ ఆడనున్నారు.రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వస్తే..యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్ ఇంకా యుజ్వేంద్ర చాహల్ అలాగే దేవదత్ పడిక్కల్ ఆడనున్నారు.