యువకుడి ప్రాణం తీసిన IPL?

Purushottham Vinay
క్రికెట్ అంటే ఇండియాలో జనాలకి ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో క్రికెట్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. ఇక IPL వచ్చిందంటే చాలు క్రికెట్ అభిమానులకి పండుగ వచ్చినట్లే. ఆ రేంజ్ లో IPL ని చూస్తారు.ముఖ్యంగా అభిమానులకు వినుల విందు అందిస్తోన్న ఐపీఎల్ కొందరి జీవితాల్లో మాత్రం తీరని విషాదాన్ని నింపుతోంది. ఆ మ్యాచ్‌ చూసి ఎంజాయ్‌ చేయాల్సింది పోగా బెట్టింగ్‌ల పేరుతో ప్రాణాల మీదికే తెచ్చుకుంటున్నారు కొందరు మూర్ఖులు.బెట్టింగ్‌ అనే ఉచ్చులో ఇరుక్కుని చాలా మంది కూడా అల్లాడిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ దారుణ సంఘటన అనేది రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాష్ అనే యువకుడు ఐపీఎల్‌ బెట్టింగ్‌లకు బాగా అలవాటు పడ్డాడు.


బుధవారం నాడు రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్‌ పంజాబ్‌ మ్యాచ్‌పై కూడా అతను బెట్టింగ్‌ వేశాడు. పంజాబ్‌ టీం గెలుస్తుందని ప్రకాష్‌ బెట్టింగ్‌ వేశాడు. అయితే ఈ మ్యా్‌చ్‌లో పంజాబ్‌ ఓటమి పాలు కావడం అనేది ప్రకాష్‌ ప్రాణాల మీదికి తెచ్చింది. ఇక బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలని బలవంతం చేయడంతో.. డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ తనకు ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇక ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హోరున ఎంతగానో విలపిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో పోస్టుమార్టంని నిర్వహించారు. యువత బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకొని ఇలా ప్రాణాలు వదలడం నిజంగా చాలా విచారకరం. ఉన్న ఒక్క జీవితాన్ని చక్కగా మలచుకొని సంతోషంగా జీవించాలి కానీ ఇలా అద్యాంతరంగా ముగించడం అసలు సరికాదు. ప్రతి తల్లిదండ్రులు ఇంకా ఇంట్లో ఉండే పెద్దలు సైతం ఖచ్చితంగా యువతపై ఓకన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: