IPL 2023: ముంబై ఆ మ్యాచ్ గెలవకుంటే ఇంటికే..?

Purushottham Vinay
ఇక లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టీంలోని ముంబై ఇండియన్స్ చాలా ఘోరంగా ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ ఛాన్స్‌లనేవి చాలా క్లిష్టంగా మారడం జరిగింది.ఇక ప్రస్తుతం లీగ్ స్టేజిలో  మొత్తం 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు ఇంకా 6 ఓటములతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది ముంబై. ఇక చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీంతో తలబడనున్న ముంబై టీం.. ప్లేఆఫ్స్‌కి వెళ్లాలంటే ఆ జట్టుపై ఖచ్చితంగా భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.ప్రస్తుతం ముంబై నెట్‌ రన్‌రేట్ వచ్చేసి -0.128 వుంది.. అటు ఆర్సీబీ, పంజాబ్ టీమ్స్ కి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు ఆ మ్యాచ్‌ల్లో కనుక గెలిస్తే.. చెరో 16 పాయింట్లనేవి వస్తాయి. ఈ తరుణంలో ముంబై టీం తన చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే సరిపోదు..ఖచ్చితంగా భారీ తేడాతో గెలవాలి. ఇంకా అలాగే బెంగళూరు, లక్నో, చెన్నై, పంజాబ్ టీమ్స్ తమ ఆఖరి మ్యాచ్‌ల్లో తప్పక ఓడిపోవాలి. లేదంటే.. రోహిత్ టీం ఖచ్చితంగా ఇంటి దారి పట్టడం ఖాయం.


ఇక మంగళవారం నాడు జరిగిన కీలక మ్యాచ్‌ని ముంబై ఇండియన్స్ తన చేజేతులా పోగొట్టుకోవడం జరిగింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హోమ్‌ టీమ్ అయిన లక్నో సూపర్ జెయింట్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశలను కాపాడుకుంది. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ టీం నిర్టీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి మొత్తం 177 పరుగులు చేసింది. ఆ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన ముంబై టీం చివరికి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఒకప్పుడు వరుస కప్ లు గెలిచి IPL లో రారాజుగా దూసుకుపోయిన ముంబై టీం ఇప్పుడు ప్లే ఆఫ్ కి చేరుకోడానికి చాలా కష్టపడుతుంది. ఒకప్పుడు ముంబై అంటేనే అన్ని టీంలు బాగా వణికిపోయేవి. తన ఆట తీరుతో దేశవ్యాప్తంగా కొట్లాది అభిమానులని సంపాదించుకుంది ముంబై టీం.మరి చూడాలి ఇక నుంచి ఎలా ఆడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: