బాహుబలి లాంటి ప్లేయర్ ను పక్కన పెట్టి.. మూల్యం చెల్లించుకున్నారు?

praveen
2023 ఐపీఎల్ సీజన్లో అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్థానం ముగిసింది. గత ఏడాదికి ఎక్కడ తగ్గకుండా అంతకుమించి అనే రేంజ్ లోనే వైఫల్యాన్ని కొనసాగించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే జట్టుకు కప్పు అందిస్తాడు అని కొత్త కెప్టెన్ ను నియమించిన కూడా.. అతను ఎక్కడ జట్టుకు ఉపయోగపడలేదు.  కెప్టెన్సీ లోనే కాదు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అతను జట్టుకు భారంగానే మారిపోయాడు అని చెప్పాలి. అయితే ఇటీవల గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడానికి తప్పక గెలవాల్సి ఉండగా.. ఈ మ్యాచ్ లో ఓడిపోయింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.

 అయితే ఈ మ్యాచ్ కోసం అటు తుది జట్టు ఎంపిక చేసిన విధానంపై మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో జట్టు పీకల్లోతూ కష్టాల్లో ఉండగా.. క్రీజు లోకి వచ్చి గ్లెన్ ఫిలిప్స్ ఎంత విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 7 బంతుల్లోనే 25 పరుగులు చేసి ఓడిపోతుంది అనుకున్న సన్రైజర్స్ వైపు విజయా అవకాశాలను తీసుకువచ్చాడు. అలాంటి బాహుబలి ఇలాంటి ప్లేయర్ ను ఇక ఇటీవల గుజరాత్ తో మ్యాచ్లో మాత్రం జట్టు యాజమాన్యం పక్కన పెట్టింది.

 అయితే గ్లెన్ ఫిలిప్స్ కేవలం బ్యాట్ తో మాత్రమే కాదు ఫీలింగ్లో కూడా అదరగొడుతున్నాడు అని చెప్పాలి. అయితే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో కొన్ని ఫీల్డింగ్  తప్పిదాలు కూడా అటు సన్రైజర్స్ ను దెబ్బతీసాయ్. ఒకవేళ ఈ మ్యాచ్ లో అతడు తుది జట్టులో ఉండి ఉంటే సన్రైజర్స్ ఫీల్డింగ్ మరింత మెరుగ్గా ఉండేదని.. బ్యాటింగ్ కూడా మరింత పటిష్టంగా ఉండేదని సన్రైజర్స్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలా మంచి ప్లేయర్ ను పక్కనపెట్టి సన్రైజర్స్ చివరికి మూల్యం చెల్లించుకుంది అంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు అత్యంత నిలకడైన జట్టుగా ఉన్న సన్రైజర్స్ ప్రస్తుతం అత్యంత పేలవమైన జట్టుగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: