నేను చనిపోయే ముందు.. ఆ రెండు వీడియోలు చూస్తా : గవాస్కర్

praveen
భారత క్రికెట్ హిస్టరీలో లెజెండరీ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు సునీల్ గవాస్కర్. ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఎనలేని సేవలు చేశాడు అని చెప్పాలి. అలాంటి సునీల్ గవాస్కర్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటోగ్రాఫ్ కోసం పరితపించి పోయిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అని చెప్పాలి. ఇటీవలే ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చపాక్ స్టేడియంలో జరిగింది అని చెప్పాలి. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని ఇక స్టేడియంలో తనకు మద్దతు పలికేందుకు వచ్చిన అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మైదానం మొత్తం తిరిగాడు.

 ఈ సమయంలో లెజెండ్ సునీల్ గవాస్కర్  పరిగెత్తుకుంటూ వెళ్లి తన షర్టుపై ధోనితో ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఈ విషయం గురించి ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు సునీల్ గవాస్కర్. ధోని ఇలా మైదానంలో అభిమానులకు అభివాదం చేస్తున్నప్పుడు నాకు ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని సృష్టించాలని అనుకున్నా. అందుకే ధోని ఆటోగ్రాఫ్ కోసం అతని వద్దకు పరిగెత్తాను. ఇక అతను కూడా ఎంతో సంతోషంగా ఆటోగ్రాఫ్ చేశాడు. అది నాకు అత్యంత ఉద్విజ్ఞ క్షణం అంటూ సునీల్ గవాస్కర్  ఎమోషనల్ అయ్యాడు.

 అయితే నా అదృష్టం కొద్ది కెమెరా బృందంలో ఒకరి వద్ద మార్కర్ పెన్ కూడా ఉంది. అయితే ఇలా సరైన సమయంలో మార్కర్ ఇచ్చినందుకు కెమెరా మెన్ కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు సునీల్ గవాస్కర్.  మరో ఎమోషనల్ కామెంట్ కూడా చేశాడు. తాను చనిపోయే చివరి క్షణాల ముందు రెండు విషయాలను గుర్తు చేసుకోవాలని అనుకుంటా అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. 1983లో కపిల్ దేవ్ ప్రపంచకప్ ను ఎత్తుకోవడం.. ఇక 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించడం.. గొప్ప క్రికెట్ సందర్భాలు. ఈ రెండు వీడియోలను చూస్తూ నేను నవ్వుతూ ఇక ప్రాణాలు వదులుతాను అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: