కోహ్లీ, గంభీర్ గొడవ.. బిగ్ షాక్ ఇచ్చిన రిఫరీ?
గతంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి పై లక్నో గెలిచినప్పుడు.. గౌతమ్ గంభీర్ ఇక ఆర్సిబి అభిమానులు అందరూ కూడా సైలెంట్ గా ఉండాలి అంటూ సైగ చేస్తూ కమ్మింపులకు పాల్పడ్డాడు. అయితే అది మనసులో పెట్టుకున్న కోహ్లీ, లక్నో వేదికగా లక్నో జట్టుపై విజయం సాధించడంతో గతంలో గంభీర్ చేసినట్లుగానే ఇక లక్నో అభిమానులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా సైగలు చేశాడు. దీంతో ఇక ఎంతో దూకుడుగా ఉండే గౌతమ్ గంభీర్ రెచ్చిపోయాడు. ఇక ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే కోహ్లీ సైతం అదే రీతిలో కోపంతో ఊగిపోయాడు.
ఇలా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన గొడవ మాత్రం మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇక విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ తీవ్రస్థాయిలో గొడవ పడిన నేపథ్యంలో మ్యాచ్ రిఫరీ దీనిపై సీరియస్ గా స్పందించారు. వారిద్దరి మ్యాచ్ ఫీజులో ఏకంగా 100% ఫైన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే గొడవకు కారణమైన లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్ కీ 50 శాతం ఫైల్ విధించాడు రిఫరి. ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక త్వరలో రిఫరీ వీరిద్దరితో స్వయంగా మాట్లాడబోతున్నట్లు తెలుస్తుంది.