డబ్ల్యూటీసి ఫైనల్.. గిల్ వద్దు అతనే బెటర్ : మైఖేల్ వాన్

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత మరో కీలకమైన పోరు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన కేవలం వారం రోజుల వ్యవధిలోనే అటు లండన్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. టెస్ట్ ఫార్మాట్లో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ దూసుకు వచ్చిన ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా జట్లు ఇలా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్లో తలబడబోతున్నాయి అన్న విషయం తెలిసిందే.

 దీంతో ఇక సాంప్రదాయమైన క్రికెట్లో ఈసారి ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కూడా డబ్ల్యూటీసి ఫైనల్ కు ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయం పైన కసరతులు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే బీసీసీఐ 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టుని డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఎంపిక చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక టీమిండియా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టుపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఎవరు ఏ స్థానంలో ఆడితే బాగుంటుంది అనే దానిపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు.

 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకల్ వాన్ స్పందించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమిండియా ఓపెనర్ గా యంగ్ ప్లేయర్ శుభమన్ గిల్ కి బదులు కేఎల్ రాహుల్ ఆడించాలని సూచించాడు మైఖేల్ వాన్. ఓవల్ పిచ్ లో బాల్ డిఫరెంట్ గా మూవ్ అవుతుంది. రోహిత్ కి జోడిగా రాహుల్ను ఓపెనింగ్ పంపిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే శుభమన్ గిల్ తో పోల్చి చూస్తే టెక్నికల్గా కేఎల్ రాహుల్ చాలా బెటర్ అంటూ మైకల్ వాన్ వ్యాఖ్యానించాడు. కాగా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11వ తేదీ మధ్య లండన్ లోని ఓవల్ మైదానంలో జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: