రింకు సింగ్ విధ్వంసం.. 8 కేజీలు తగ్గిన బౌలర్?

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది అనే విషయం తెలిసిందే. ఇక ప్రతి మ్యాచ్ కూడా ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో భాగంగా ఎంతో మంది ప్లేయర్లు అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంటున్నారు. అయితే అదే సమయంలో కొంతమంది ప్లేయర్లకు ఈ ఏడాది ఐపీఎల్ ఒక పీడ కలలా మిగిలిపోతుంది అని చెప్పాలి. ఎందుకంటే సరైన ప్రదర్శన చేయలేక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు.

 ఇక ఒకే ఓవర్ లో ఎక్కువ పరుగులు సమర్పించుకొని చెత్త రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటున్న ఆటగాళ్లు చాలామంది ఈ ఐపీఎల్ సీజన్లో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఈ ఏడాది ఐపీఎల్ లో ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకునే ఒకే ఒక ఘటన.. చివరి ఓవర్లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ 5 బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించడమే. తన ఇన్నింగ్స్ తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు రింకు సింగ్. అప్పటి వరకు తన బౌలింగ్ తో మెప్పించిన  యష్ దయాల్ కు ఒక పీడకల లాంటి రోజును మిగిల్చాడు అని చెప్పాలి.

 అయితే రింకు సింగ్ తన బౌలింగ్లో ఇలా ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత యష్ దయాల్ ఎంతలా ఫీల్ అయ్యాడో అందరం చూసాం. అయితే ఇలా ఐదు సిక్షలు ఇచ్చిన యష్ దయాల్ ను తర్వాత మ్యాచ్ కి గుజరాత్ టైటాన్స్ పక్కన పెట్టింది. మోహిత్ శర్మను జట్టులోకి తీసుకుంది. అయితే ఇటీవల ఈ విషయంపై గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ తర్వాత కుంగు బాటు.. మరియు ఇతర కారణాలతో యష్ దయాల్ వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడు. దీంతో దాదాపు 8 కేజీల బరువు తగ్గాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగాలేదు అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: