ముంబై పై పంజాబ్ గెలుపు.. ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో తెలుసా?

praveen
ఇటీవల ఐపీఎల్  లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా  సాగింది అన్న విషయం తెలిసిందే. ఇరూ జట్లు కూడా భారీ స్కోర్ నమోదు చేశాయి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 214 పరుగులు చేసింది. అయితే భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ చివరి వరకు గెలుపు కోసం పోరాడినప్పటికీ చివరికి ఓటమి తప్పలేదు అని చెప్పాలి. తొలిత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అయితే శ్యామ్ కరణ్, హర్ ప్రీత్ భాటియా, జితేష్ శర్మలు కలిసి చేసిన విధ్వంసానికి ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి అని చెప్పాలి.

 చివరి ఆరు ఓవర్లలో పంజాబ్ 109 పరుగులు పిండుకుంది. అయితే ఈ మ్యాచ్ లో బద్దలైన  రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 ముంబై ఇండియన్స్ తో మ్యాచ్లో పంజాబ్ బ్యాట్స్మెన్ జీతేష్ శర్మ సంచలన సృష్టించాడు. ఏడు బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ తరఫున అత్యధిక స్ట్రైక్ రేట్ 357.14 నమోదు చేసిన తొలి ప్లేయర్గా నిలిచాడు. అంతకుముందు భానుకా రాజపక్ష 9 బంతుల్లో 31 పరుగులు చేసి 344.44 స్ట్రైక్ రేట్.. 16 బంతుల్లో 51 పరుగులు చేసి కేఎల్ రాహుల్  318.75 స్ట్రైక్ రేట్,  నికోలాస్ పూరన్ 8 బంతుల్లో 25 పరుగులు 312.5 స్ట్రైక్ రేట్ తో ఉన్నారు.

 ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో చివరి 6 ఓవర్లలో పంజాబ్ 109 పరుగులు రాబట్టుకోగా.. ఐపిఎల్ చరిత్రలో చివరి ఆరు ఓవర్లలో ఇన్ని పరుగులు చేయడం పంజాబ్ జట్టుకు ఇదే తొలిసారి.

 ఇక ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఓకే ఓవర్ లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండవ బౌలర్గా అర్జున్ టెండూల్కర్ చెత్త రికార్డు సృష్టించాడు. ఓకే ఓవర్లో ఏకంగా 31 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ లిస్టులో తొలి స్థానంలో డేనియల్ సామ్స్ 35 పరుగులు ఇచ్చిన బౌలర్ గా ఉన్నాడు.

 ముంబై ఇండియన్స్ తో మ్యాచ్లో పంజాబ్ బ్యాట్స్మెన్లు శాంకరణ్, హర్ ప్రీత్  ఐదో వికెట్ కు 92 పరుగులు జోడించారు.కాగా ఐపీఎల్ హిస్టరీలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఐదో వికెట్ కు ఇదే రెండవ అత్యుత్తమ భాగస్వామ్యం కావడం గమనార్హం. తొలి స్థానంలో డేవిడ్ మిల్లర్, రాజగోపాల్ సతీష్ 130 పరుగుల భాగస్వామ్యంతో తొలి స్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: