సన్రైజర్స్ ప్లేయర్స్ కి ధోని సలహాలు.. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగేనా?
మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లందరూ కూడా ఇదే చేశారు. ధోని సన్రైజర్స్ ఆటగాళ్లను కలిసి ఎన్నో విలువైన సలహాలు ఇచ్చాడు అన్నది తెలుస్తుంది. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. హోమ్ గ్రౌండ్ లో తమను ఓడించడం అంత సులువైన విషయం కాదు అన్న విషయాన్ని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ నిరూపించింది. ఈ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చెన్నై బౌలర్ల దాటికి చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది.
ఇక ఆ తర్వాత స్వల్ప టార్గెట్ తోనే బరిలోకి దిగిన చెన్నై జట్టు 18.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను చేదించింది. తద్వారా విజయం సాధించి హోం గ్రౌండ్లో అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చింది.అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని సన్రైజర్స్ యువ ఆటగాళ్లను కలిశారు. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ డాగర్ సహా ఇతర ఆటగాళ్లు ధోని చెప్పిన సలహాలను ఎంతో శ్రద్ధగా వినడం ఆసక్తిని కలిగించింది. అయితే కేవలం మ్యాచ్లో మాత్రమే అవతలి జట్టు ప్లేయర్లను ప్రత్యర్థులుగా చూస్తూ ఉంటాడు ధోని. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి జట్టులోని ప్లేయర్లతో ఎక్కువ గడపడానికి ధోని ఇష్టపడతాడు. గతంలో కూడా ఎంతోమంది ప్రత్యర్థులకు సలహాలు ఇచ్చాడు. ఇక ఇప్పుడు సన్రైజర్స్ కి ధోని సలహాతో నైనా జ్ఞానోదయం కలుగుతుందేమో అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.