చికెన్ కూర రుచి చూడలేదని.. కొడుకుని చంపేసిన తండ్రి?

praveen
ఇటీవల కాలం లో వెలుగు లోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత నిజం గానే సభ్య సమాజం లో బ్రతుకుతుంది మనుషులేనా అనే అనుమానం ప్రతి ఒక్కరులు కలుగుతుంది. ఎందుకంటే జాలి దయ మానవత్వం అనే గుణానికి మారు పేరుగా ఉన్న మనుషులు ఇక ఇప్పుడు ఆ గుణం లేకుండా కనిపిస్తూ ఉన్నారు. పరాయి వాళ్ల విషయం లోనే కాదు ఏకంగా సొంత వారి విషయం లో కూడా కాస్తయినా కనికరం చూపడం లేదు అని చెప్పాలి. చిన్నచిన్న కారణాలకే క్షణికావేశంలో విచక్షణ కోల్పోతున్న మనిషి సొంత వారి ప్రాణాలను దారుణంగా తీసేందుకు కూడా వెనకాడని పరిస్థితి కనిపిస్తుంది.

 వెరసి ఇలాంటి తరహా ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అనుక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొంతవారే ఏ కారణానికి ఎప్పుడు ప్రాణాలు తీస్తారో  అనుక్షణం భయపడుతూనే ఉన్నాడు మనిషి. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోడి కూర ఏకంగా తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్యకు గురయ్యే పరిస్థితిని తీసుకువచ్చింది అని చెప్పాలి. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో వెలుగు చూసింది.

 శీనా అనే వ్యక్తి తన ఇంట్లో చికెన్ కూర వండాడు. అయితే దానిని రుచి చూడాలి అంటూ కొడుకు 32 ఏళ్ల శివరామ్ ను కోరాడు. అయితే అతను మాత్రం రుచి చూసేందుకు నిరాకరించాడు. ఇక ఈ విషయంలో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది అని చెప్పాలి. దీంతో కోపంతో విచక్షణ కోల్పోయిన  షీనా చెక్కతో కొడుకు శివరామ్ ను దారుణంగా కొట్టాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన శివరామ్ ప్రాణాలు వదిలాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని తండ్రి షీనాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: