ఐపీఎల్ లో ప్లే ఆఫ్ వెళ్లే జట్లు ఇవేనట.. ముందే చెప్పేసిన మంజ్రేకర్?

praveen
ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ హడావిడి మొదలైపోయింది. నేడు మొదటి మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ లో భాగంగా అటు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ మొదటి మ్యాచ్ కి అటు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తూ ఉంది అని చెప్పాలి. ఇక వరుసగా ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందేందుకు అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోయారు అని చెప్పాలి. అయితే కరోనా వైరస్ కారణంగా గత రెండు మూడు సీజన్ ల నుంచి అన్ని వేదికలపై మ్యాచ్లు జరగలేదు.

 కానీ ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో  ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని మ్యాచ్ లు అన్నింటినీ కూడా అన్ని జట్ల హోమ్ గ్రౌండ్ లపై నిర్వహించేందుకు అటు బీసీసీఐ కూడా నిర్ణయించింది అని చెప్పాలి. దీంతో ఎంతోమంది ప్రేక్షకులు చాలా రోజుల తర్వాత ఇక నేరుగా మ్యాచ్ వీక్షించే అవకాశం లభించింది అని చెప్పాలి. అయితే ఇక ఐపీఎల్ మ్యాచ్లు ఇంకా ప్రారంభం కానే లేదు అప్పుడే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ 2023 ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ కు వెళ్లే జట్లు ఏవి అన్న విషయాన్ని ముందుగానే అంచనా వేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇక 2023 ఏడాది ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ కి చేరే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశాడు సంజయ్ మంజ్రేకర్. అయితే ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ను, గత ఏడాది మొదటి ప్రయత్నంలోనే ఐపిఎల్ టైటిల్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ని మాత్రం సంజయ్ మంజ్రేకర్ పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పాలి. కాగా ఈ ఏడాది అన్ని జట్లు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఉండడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: