యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కి.. ఆర్సీబీ అరుదైన గౌరవం?

praveen
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి క్రిస్ గేల్ మరో మారు వచ్చి చేరాడు. ఐపీఎల్ లో ఆర్ సి బి కి ఇతను మాజీ ఆటగాడు కావడం విశేషం ఇక అందరూ ముద్దుగా గేల్ ని యూనివర్స్ బాస్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. గత సీజన్లో పంజాబ్ తరఫున క్రిస్ గేల్ ఆడదాం 2011 నుంచి క్రిస్ గేల్ బెంగళూరు కె ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు 2017 వరకు కూడా ఆర్సిబి తోనే క్రిస్ గేల్ భాగంగా ఉన్నాడు కానీ గత ఆరేళ్లుగా పంజాబ్ కింగ్స్ తో ఉన్న క్రిస్ గేల్ ఇప్పుడు హాల్ ఆఫ్ ఫేమ్ లో మాజీ ఆటగాలను చేర్చుకునే పద్ధతిలో క్రిస్ గేల్ ని ఆర్సిబి తవ జట్టుకు రప్పించుకుంది.
ఈ విషయాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు టీం హాల్ ఆఫ్ ఫెమ్లో లో భాగం గా  క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ తో కలిపి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ పోస్టును జత చేస్తూ యూనివర్స్ బాస తన సొంత ఇంటికి చేరుకున్నట్టుగా తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన తర్వాత అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఈ రకంగా ఇద్దరు మాజీ ఆటగాలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం లో భాగంగా చేర్చుకుంది. అంతే కాదు ఈ ఇద్దరు ఆటగాళ్ల కోసం వారి గౌరవార్థం జెర్సీ నెంబర్ ను రిటైర్ కూడా చేయాలని రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టు నిర్ణయించుకుంది.
ఇక విషయం పై విరాట్ కోహ్లీ స్పందించాడు.ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్లతో ఆడడం తమకు ఎంతో సంతోషం అంటూ వ్యక్తం చేశాడు కోహ్లీ. ఇక ఏపీ డివిలియర్స్ గతంలో ఆడుతున్నట్టుగా ప్రస్తుతం ఆడలేదని ఆడటం లేదు అంటూ తెలిపారు. అతడు బ్యాటింగ్ పద్ధతి అలాగే క్రికెట్ ఆడే విధానం చాలా వరకు మార్చుకున్నాడు అంటూ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. క్రిస్ గేల్ తో తనకు 7 ఐపీఎల్ సీజన్స్ ఆడే అవకాశం దక్కింది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక క్రిస్ గేల్ కి ఐపీఎల్ లో ఒక రికార్డు కూడా ఉంది. ఐపీఎల్ చరిత్రలో 27 ఓవర్లకు 20 కి పైగా పరుగులు సాధించిన వ్యక్తిగా క్రిస్ గేల్ నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: