బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలిచిన ఇండియా!
ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ మొత్తం 128 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ మొత్తం 186 పరుగులు చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియన్ బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు, షమి రెండు వికెట్లు తీశారు. ఆసిస్ రెండో ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ 90 పరుగులు ఇంకా అలాగే మార్నస్ 63 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా 175 పరుగుల వద్ద మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు.ఇక ఇదిలా ఉంటే శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు సందేహాస్పదంగా ఉన్నాడు. అతనికి నడుము నొప్పి కారణంగా చివరి టెస్టులో 4వ రోజు బ్యాటింగ్కు రాలేదు. అతడిని స్కానింగ్ కోసం తీసుకెళ్లగా రిపోర్టులు సరిగ్గా లేవని తేలింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సంజూ శాంసన్ వన్డే టీం లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఫస్ట్ వన్డే జట్టులో శాంసన్ను ఎంపిక చేయలేదు. ఇక ప్రస్తుతం అయ్యర్ స్థానంలో సంజు శాంసన్ను ఎంపిక చేస్తారా లేదా అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.