వినూత్న రీతిలో.. ధోని పై అభిమానం చాటుకున్న ఫ్యాన్?
అందుకే మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెబితే చాలు అభిమానులు అందరూ కూడా పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు. ధోని మైదానంలో కనిపించాడు అంటే చాలు అతనిపేరును నినాదాలు చేస్తూ ఇక స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయేలా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే అంతర్జాతీయ క్రికెట్కు దూరమైనప్పటికీ అభిమానుల కోసం ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున క్రికెట్ ఆడుతూ అలరిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. అయితే ధోని అభిమానులు అందరూ కూడా మిస్టర్ కూల్ పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే గతంలో ఇండియా ఒక మ్యాచ్ ఆడుతున్న సమయంలో ధోనీకి సంబంధం లేకపోయినప్పటికీ మిస్టర్ కూల్ అభిమానులు మాత్రం ఒక భారీ కట్ అవుట్ ను ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక్కడ ఒక అభిమాని సరికొత్తగా ధోని పై అభిమానాన్ని చాటుకున్నాడు. కర్ణాటక కు చెందిన ఒక అభిమాని తన వివాహ శుభలేఖ పై ధోని ఫోటోను ముద్రించాడు. ఈ క్రమంలోనే ఈ వివాహపత్రిక అందుకున్న ఒక వ్యక్తి దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. ధోని అంటే ఆ మాత్రం ఉంటుంది మరి అని కామెంట్ చేస్తున్నారు.