బుమ్రాను పక్కకు పెట్టి.. అతన్ని జట్టులోకి తీసుకోండి?

praveen
భారత జట్టులో పేస్ గుర్రం గా పేరు సంపాదించుకున్న జస్ ప్రీత్ బుమ్రా గత కొన్ని నెలల నుంచి టీమ్ ఇండియాకు దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక వెనునొప్పి గాయం బారిన పడిన బుమ్రా ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాడు. ఇక అతను సర్జరీ చేసుకుని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేకపోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బుమ్రా ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అని అభిమానులు ఎదురు చూడటం తప్ప అతను జట్టులోకి రావడం మాత్రం జరగడం లేదు.

 ఐపీఎల్ కోసమే అతను ఫిట్నెస్ కాపాడుకుంటున్నాడు అని కొన్ని విమర్శలు రాగా.. ఇక ఐపిఎల్ సీజన్ మొత్తానికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్  ఫైనల్లో కూడా అతను అందుబాటులో ఉండడు అన్న విషయం ఇటీవల బీసీసీఐ తెలిపింది. దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు. ఇక అతనికి స్పెషల్గా సర్జరీ చేయించేందుకు విదేశాలకు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది అన్నది తెలుస్తుంది. అయితే బుమ్రా లాంటి కీలకమైన బౌలర్ లేకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్  ఫైనల్లో టీమిండియా ఎలా పోరాడుతుందో అని అందరూ ఆందోళనలో మునిగిపోయారు.

 ఇక ఇదే విషయంపై ఇటీవలే మాజీ క్రికెటర్ మదన్ లాల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయాలతో గత కొంతకాలంగా జట్టుకు దూరమైన ఫేసర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రస్తుతానికి పక్కన పెట్టడం మంచిది అంటూ వ్యాఖ్యానించాడు మదన్ లాల్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో ముగ్గురు ఫేసర్లు ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక జట్టులోకి ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న ఉమేష్ యాదవ్ ను తీసుకోవాలంటూ సూచించాడు. అయితే బుమ్రా ఏడాదిన్నర తర్వాత జట్టు లోకి వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. పాత బుమ్రాను చూడాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: