చికెన్ ముక్క.. మహిళ ప్రాణం తీసింది?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుంది అన్నది కూడా ఊహకుందని విధంగానే మారిపోయింది. ఒకప్పుడు అయితే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు లేదా రోడ్డు ప్రమాదం బారిన పడి గాయాల పాలైనప్పుడు మరణం సంభవించేదని అందరూ అనుకునేవారు.  లేదా వృద్ధాప్యంలో ప్రాణాలు పోయేవని భావించేవారు. కానీ ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న ఘటనలు చూసిన తర్వాత చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరు ఎప్పుడు చనిపోతారు అన్నది కూడా తెలియని విధంగా మారిపోయింది. దీంతో ప్రతి ఒక్కరికి ప్రాణాలపై తీపి పెరిగిపోయింది అని చెప్పాలి.

 ముఖ్యంగా ఇటీవలే కాలంలో ఎంతోమంది సడన్ హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోతూ ఉన్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఏ క్షణంలో చనిపోతామో కూడా తెలియని మనిషి.. ప్రతిక్షణం భయపడుతూనే బ్రతుకుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఎంతో ఇష్టంగా చికెన్ కూర ఆరగించింది. కానీ ఆ చికెన్ తన ప్రాణాలు తీస్తుంది అని మాత్రం ఊహించలేకపోయింది. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మహిళ చనిపోయింది.

 ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది అని చెప్పాలి. మాసాయిపేట మండలం లోని కొప్పులపల్లి గ్రామ శివారులో ఇటుక బట్టీలో పనిచేస్తూ ఉంది ఒరిస్సాకు చెందిన కార్మికురాలు. అయితే ఇటీవల ఇంట్లో చికెన్ తెచ్చుకొని ఎంతో ఇష్టంగా తినాలని అనుకుంది. ఈ క్రమంలోనే గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని ఊపిరాడక  ప్రాణాలు వదిలింది. రాత్రి సమయంలో భోజనం చేసిన అనంతరం ఛాతిలో  నొప్పి రావడంతో వెంటనే దగ్గరిలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం ఉద్యమంలోనే ప్రాణాలు వదిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: