ఇండోర్ టెస్ట్ గెలిస్తే.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు?
నేటి నుంచి ఇండోర్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మరోసారి స్పిన్ ప్రధాన అస్త్రంగా భారత జట్టు బరిలోకి దిగుతుంది. అయితే ఇక ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మరోసారి టీమిండియా సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి. దీంతో ఈ సిరీస్లో మరోసారి భారత జట్టుదే ఆధిపత్యం కొనసాగుతుంది. అయితే గత మూడు బోర్డర్ గావాస్కర్ ట్రోఫీను కూడా భారత జట్ట గెలుచుకోవడం గమనార్హం. దీంతో ఇక ఇప్పుడు కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిస్తే టీమిండియా చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఒక వైపు సిరీస్ మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఛాన్స్. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అని చెప్పాలి.
అయితే ఇంతకుముందు జరిగిన వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ లలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో.. ఇక అటు కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించారు అన్న విషయం తెలిసిందే. అయితే మూడో టెస్టులో అతను తుది జట్టులో ఉంటాడా లేదా అన్నది కూడా అనుమానంగా మారిపోయింది. అయితే అతని స్థానంలో ఎవరికి వైస్ కెప్టెన్సీ అప్పగిస్తారు అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఇక మరికొంత సేపట్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది అన్నది తెలుస్తుంది.