ఐపీఎల్ కి ముందు.. గుజరాత్ టైటాన్స్ జట్టుకి షాక్?

praveen
2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి అటు బీసీసీఐ అని వివరాలను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పూర్తి షెడ్యూల్ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఏ డేట్ రోజు ఎవరి మధ్య పోరు జరగబోతుంది అన్న విషయంపై కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాదు ఇక ఆయా జట్ల అభిమానులకు సైతం పూర్తి క్లారిటీ ఉంది అని చెప్పాలి. అయితే మార్చ్ 31వ తేదీ నుంచి కూడా 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే అన్ని ఫ్రాంచైజీలు  కూడా తమ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఇక తమ జట్టును మరింత పటిష్టవంతంగా మార్చుకునేందుకు కొత్త ఆటగాళ్లను కూడా కొనుగోలు చేశాయి అన్ని ఫ్రాంచైజీలు .

 ఈ క్రమంలోనే ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే దానిపై మాత్రం ప్రస్తుతం ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. అయితే గత ఏడాది మొదటిసారి ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ఎంతలా సత్తా చాటిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో బరిలోకి దిగిన ఆ టీం మొదటి ప్రయత్నంలోనే ఏకంగా ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టుగా అవతరించింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఛాంపియన్ జట్లను సైతం ఓడించి టైటిల్ గెలుచుకుని తమ ప్రదర్శనతో అందరినీ ఫిదా చేసేసింది. ఇక ఈసారి కూడా గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది అని చెప్పాలి.

 ఇలాంటి సమయంలో పలువురు ఆటగాళ్లు గాయం బారిన పడుతూ ఇక జట్టుకు దూరం అవుతుండడం జరుగుతుంది.   గుజరాత్ టైటాన్స్  జట్టుకు ఇప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగిలింది. జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న జోష్ లిటిల్ మోకాలికి గాయం అయింది. కాగా గుజరాత్ టైటాన్స్ అతన్ని ఏకంగా 4.4 కోట్లు పెట్టి వేలంలో కొనుగోలు చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్ తరఫున ఆడుతున్నాడు జోష్ లిటిల్. ఇక గాయం కారణంగా పాకిస్తాన్ సూపర్ లీక్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. అతను కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే అటు ఐపీఎల్  గుజరాత్ టైటాన్స్ కి కూడా అతను అందుబాటులో ఉండడం కష్టమే అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: