జడేజాకు నాకంటే క్రికెట్ ఎక్కువ : రివాబా

praveen
రవీంద్ర జడేజా.. గత కొన్ని రోజుల నుంచి ఈ పేరు భారత క్రికెట్ లో మారుమోగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆసియా కప్ సమయంలో మోకాలి గాయం బారిన పడిన రవీంద్ర జడేజా ఇక శస్త్ర చికిత్స చేసుకొని టీం ఇండియా జట్టుకు దూరమయ్యాడు. దాదాపు 5 నెలల పాటుక్రికెట్కు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా ఇక ఇటీవల ఫిట్నెస్ సాధించి ఆస్ట్రేలియా తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మళ్ళీ తుది జట్టులోకి వచ్చేసాడు అని చెప్పాలి. సాధారణంగా అయితే రీ ఎంట్రీ తర్వాత ఆటగాళ్లు మళ్ళీ మైదానంలో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకుంటారు.

 కానీ రవీంద్ర జడేజా మాత్రం తన అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టేసాడు అని చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్లలో కూడా బంతితో, బ్యాట్ తో కూడా రాణించి  రెండు మ్యాన్ అఫ్ ది మ్యాచ్లను అందుకున్నాడు రవీంద్ర జడేజా. దీంతో రీ ఎంట్రీ తర్వాత అతను మరింత అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అని ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజాకు ఆటపట్ల ఎంతో అంకితభావం ఉంది అన్న విషయాన్ని జడేజా భార్య రివాబా జడేజా ఇటీవల చెప్పుకొచ్చారు.

 తన భర్త జడేజాకు అన్నింటికంటే క్రికెట్ ఎక్కువ అంటూ చెప్పుకొచ్చింది. ఆటపై తన భర్తకు అమితమైన అంకితభావం ఉంది అంటూ తెలిపింది. ఇక తనకంటే క్రికెట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రివాబా జడేజా. ఇక జడేజా గాయం నుంచి కోలుకొని మళ్ళీ తిరిగి మైదానంలోకి అడుగు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక జడేజా ఆటపట్ల ఎంతో నిబద్ధతతో ఉంటాడు. అదే ఆయన బలం కూడా. దేశం తరపున ఆడటానికి తొలి ప్రాధాన్యత ఇస్తాడు. ఎప్పుడు తక్కువగా మాట్లాడే జడేజా తనను విమర్శించే వాళ్ళకి తన ఆట తీరుతోనే సమాధానం చెబుతాడు. లోపాలపై దృష్టి పెట్టి ముందుకు సాగుతాడు అంటూరి రివాబా   చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: