జడేజా ఇలా ఎందుకు చేశాడబ్బా.. అందరిలో ఇదే ప్రశ్న?

praveen
మోకాలి గాయం కారణంగా దాదాపు 5 నెలలపాటు అటు టీమిండియాకు దూరమైన రవీంద్ర జడేజా ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ద్వారా మళ్ళీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా రి ఎంట్రీ ఇచ్చిన సమయంలో మళ్ళీ కుదురుకోవడానికి ఏ ఆటగాడు అయినా సరే కొంత సమయం తీసుకుంటూ ఉంటాడు. కానీ రవీంద్ర జడేజా మాత్రం రి ఎంట్రీ మ్యాచ్ నుంచి అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఒకవైపు బ్యాటింగ్లో మరోవైపు బౌలింగ్ లో కూడా తనకు తిరుగులేదు  అని నిరూపిస్తున్నాడు. ఇక ఎప్పటిలాగానే మైదానంలో పాదరసంలా కదులుతూ ప్రత్యర్థులను భయపెట్టిస్తూ ఉన్నాడు.

 తన స్పిన్ బౌలింగ్ తో ఇక భారత పిచ్ లపై తాను ఎంత డేంజరస్ బౌలర్ అన్న విషయాన్ని ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్లలో కూడా నిరూపించాడు అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా ఓటమిని శాసిస్తుంది ఒక రవీంద్ర జడేజానే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొదటి మ్యాచ్ లో బంతితో బ్యాట్ తో రాణించిన రవీంద్ర జడేజా  మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఇక రెండవ మ్యాచ్ లో బ్యాట్ తో రాణించకపోయినప్పటికీ ఏకంగా మొదటి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు.. రెండవ ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసి మరోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల రవీంద్ర జడేజా కు సంబంధించిన ఒక విషయం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మైదానంలో చలాకీగా ఉండే రవీంద్ర జడేజా సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటాడు. అయితే జడేజాకు ఐదు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండగా అతను మాత్రం ఎవరిని ఫాలో అవ్వడం లేదు. కానీ ఇటీవల జడేజా తనకు మంచి మిత్రుడైన ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ ను ఫాలో అయ్యాడు. అది కూడా కేవలం 24 గంటలు పాటు మాత్రమే. అయితే ఇలా లియోన్ ను ఎందుకు ఫాలో అయ్యాడో తెలియదు. కానీ ఇక ఇలా 24 గంటల పాటు  లియోన్ ను సోషల్ మీడియాలో ఫాలో అయిన విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. జడేజా ఎందుకు ఇలా చేశాడో అని అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: