అలా చేసింది.. నిజంగా కోహ్లీనేనా.. ఫ్యాన్స్ షాక్?

praveen
క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అతని ఎనర్జీ చూసి అటు ప్రత్యర్థులు సైతం భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి.  అయితే తనతో పాటు ఆడుతున్న మిగతా సహచరులు ఎవరైనా తప్పు చేస్తారేమో కాని విరాట్ కోహ్లీ మాత్రం తప్పిదాలు చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అని చెప్పాలి. అయితే దూకుడు కేవలం తన ప్రవర్తనలోనే కాదు తన ఆట తీరుతో కూడా చూపిస్తూ ఉంటాడు. ఇకపోతే ప్రపంచం క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్లలో అటు విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు.

 అతని ఫీల్డింగ్ ప్రమాణాలు చూసిన తర్వాత విరాట్ కోహ్లీ  లాగా మరే క్రికెటర్ కూడా ఫీల్డింగ్ చేయలేడేమో అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా అత్యుత్తమమైన ఫీల్డింగ్ కి పెట్టింది పేరుగా ఉండే విరాట్ కోహ్లీ అటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మాత్రం పేలవ ఫీల్డింగ్ ని కొనసాగిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్లో స్లిప్ లో ఫీల్డింగ్  చేస్తున్న సమయంలో రెండు ఈజీ క్యాచ్ లను   జార విరిచాడు విరాట్ కోహ్లీ. దీంతో విరాట్ కోహ్లీనేనా ఇలాంటిది చేసింది అని అందరూ షాక్ అయ్యారు. అయితే కోహ్లీ అత్యుత్తమ ఫీల్డర్ కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విరాట్ కోహ్లీని ఏమీ అనలేకపోయాడు. అయితే ఇక ఇప్పుడు రెండో టెస్టులోనూ ఇక ఇలా ఒక సులువైన క్యాచ్ ని నేలపాలు చేశాడు అని చెప్పాలి.

 పీటర్ హాండ్స్ కోబ్ ఇచ్చిన సులువైన క్యాచ్ ని కోహ్లీ నేలపాలు చేశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో 68వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ వేశాడు. అయితే ఆ ఓవర్లో ఐదవ బంతిని హాండ్స్ కోబ్ అవుట్ సైడ్ ఆఫ్ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న విరాట్ కోహ్లీ బంతిని అందుకునే ప్రయత్నంలో చేతి ఎడ్జ్ తగిలి పైకి వెళ్ళిన బంతి బౌండరీ వైపు పరుగులు పెట్టింది. అయితే సింపుల్ క్యాచ్ ని మిస్ చేసిన విరాట్ కోహ్లీ నేల మీద పడుకుని అబ్బా క్యాచ్ మిస్ అయింది అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ ఇలా క్యాచ్లు మిస్ చేయడంతో అక్కడ ఉన్నది నిజంగా మా విరాట్ కోహ్లీనేనా అని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: