వేలంలో భారీ ధర.. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి?
ఎంతో మంది స్టార్ ప్లేయర్లు సైతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగం కావాలని భావిస్తూ ఉంటారు. ఇక అలాంటి అవకాశం ఒక లేడీ క్రికెటర్ కు వస్తే ఇక ఆమె ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా మహిళా క్రికెటర్ రేణుక సింగ్ ఇలాంటి అవకాశాన్ని దక్కించుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఒక టీం గా కొనసాగుతుంది. అయితే ఇటీవల ముంబైలో జరిగిన మెగా వేలంలో ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి మరి బెంగళూరు ఫ్రాంచైజీ రేణుక సింగ్ ను కొనుగోలు చేసింది. 1.5 కోట్ల భారీ తరపు ఆర్సిబి ఆమెను దక్కించుకుంది అని చెప్పాలి.
అయితే ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో బిజీగా ఉండగా.. ఇటీవల జరిగిన మెగా వేలం ప్రక్రియని భారత క్రికెటర్లు అందరూ కూడా బస చేస్తున్న హోటల్లో వీక్షించారు. అయితే వేలంలో రేణుకా సింగ్ ను అటు ఆర్సీబీ దక్కించుకోవడంతో ఇక మిగతా ప్లేయర్స్ అందరూ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఏకంగా రేణుక సింగ్ చుట్టూ చేరి ఆర్సిబి ఆర్సిబి అంటూ గట్టిగా అరెస్టు సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.