వేలంలో భారీ ధర.. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ప్రపంచ క్రికెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సాధారణంగా అయితే టైటిల్స్ ఎక్కువసార్లు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఒక్కసారి కూడా టైటిల్ గెలవక పోయినప్పటికీ ఊహించని రీతిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జట్టు ఏదైనా ఉంది అంటే అది విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అని చెప్పాలి. ఇప్పుడు వరకు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేక నిరాశపరిచింది. అయినప్పటికీ టీం కి మాత్రం ఊహించని రీతిలో అభిమానులు ఉన్నారు.

 ఎంతో మంది స్టార్ ప్లేయర్లు సైతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగం కావాలని భావిస్తూ ఉంటారు. ఇక అలాంటి అవకాశం ఒక లేడీ క్రికెటర్ కు వస్తే ఇక ఆమె ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా మహిళా క్రికెటర్ రేణుక సింగ్ ఇలాంటి అవకాశాన్ని దక్కించుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఒక టీం గా కొనసాగుతుంది. అయితే ఇటీవల ముంబైలో జరిగిన మెగా వేలంలో ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి మరి బెంగళూరు ఫ్రాంచైజీ రేణుక సింగ్  ను కొనుగోలు చేసింది. 1.5 కోట్ల భారీ తరపు ఆర్సిబి ఆమెను దక్కించుకుంది అని చెప్పాలి.

 అయితే ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో బిజీగా ఉండగా.. ఇటీవల జరిగిన మెగా వేలం ప్రక్రియని భారత క్రికెటర్లు అందరూ కూడా బస చేస్తున్న హోటల్లో వీక్షించారు. అయితే వేలంలో రేణుకా సింగ్ ను అటు ఆర్సీబీ దక్కించుకోవడంతో ఇక మిగతా ప్లేయర్స్ అందరూ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఏకంగా రేణుక సింగ్ చుట్టూ చేరి ఆర్సిబి ఆర్సిబి అంటూ గట్టిగా అరెస్టు సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl

సంబంధిత వార్తలు: