ఉమెన్స్ ఐపీఎల్.. బిసిసిఐకి 4000 కోట్ల లాభం?

praveen
ప్రస్తుతం భారత్లో క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఏకంగా క్రికెటర్లను ఆరాధ్య దైవంగా అభిమానిస్తూ ఉంటారు ప్రేక్షకులు.  అయితే మొన్నటి వరకు కేవలం పురుషుల క్రికెట్ కి మాత్రమే ఇలాంటి పాపులారిటీ ఉండేది. అటు మహిళా క్రికెటర్లు ఎంత బాగా రాణించినా.. ఎన్ని ప్రపంచ రికార్డులు  కొల్లగొట్టిన.. వారి మ్యాచ్లను చూసే వారే ఉండేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పురుషులతో సమానంగానే మహిళా క్రికెటర్లకు కూడా వేతనాలు చెల్లించేందుకు సిద్ధమైంది.

 అంతేకాదు మహిళా క్రికెటర్లకు ఉన్న ఆదరణను మరింత పెంచేందుకుగాను ఇక ఉమెన్స్ క్రికెటర్లకు ఐపీఎల్ నిర్వసిస్తున్నట్లుగానే అటు ఉమెన్స్ క్రికెటర్లకు కూడా ఈ ఏడాది నుంచి ఐపిఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది అన్న విషయం తెలిసిందదే. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి అన్ని సన్నాహాలను పూర్తి చేస్తుంది బీసీసీఐ. ఇకపోతే ఇక ఐపీఎల్ లో ఆయా జట్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలను కూడా ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే.

 మెన్స్ ఐపీఎల్ మాదిరిగానే అటు ఉమెన్స్ ఐపీఎల్ లో కూడా బీసీసీఐకి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహిళల ఐపీఎల్ జట్ల వేలంతో బీసీసీఐ దాదాపు 4వేల కోట్లు ఆదాయం ఆర్జించబోతున్నట్లు తెలుస్తుంది. జట్లను కొనుగోలు చేసేందుకు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని.. ఒక్కో జట్టు 5 నుంచి 600 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారని చెప్పాలి. కాగా నేడు ఉమెన్స్ ఐపీఎల్ మెగా వేలం జరగబోతుంది ఇందులో పాల్గొనేందుకు 30కి పైగా సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయ్ అని చెప్పాలి.  ఇక వీటిలో అదాని గ్రూప్, కొటక్ గ్రూప్, ఆదిత్య అండ్ బిర్లా గ్రూప్ లాంటి బడాబడా సంస్థలు కూడా ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ip

సంబంధిత వార్తలు: